రూ.4లకే భోజనం పథకాన్ని ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి
జిహెచ్ఎంసి లో పేద ప్రజల కడుపునింపుతున్న రూ.5 భోజనం తరహాలోనే తన నియోజకవర్గంలో రూ. 4 లకే భోజనం పెట్టే పథకాన్ని ఆదివారం నాడు ప్రారంభించాడు.ఇటీవల ఆయన హైద్రాబాద్ లోని జిహెచ్ఎంసి లో నిర్వహిస్తున్న రూ.5 భోజన
గుంటూరు: జిహెచ్ఎంసి లో పేద ప్రజల కడుపునింపుతున్న రూ.5 భోజనం తరహాలోనే తన నియోజకవర్గంలో రూ. 4 లకే భోజనం పెట్టే పథకాన్ని ఆదివారం నాడు ప్రారంభించాడు.ఇటీవల ఆయన హైద్రాబాద్ లోని జిహెచ్ఎంసి లో నిర్వహిస్తున్న రూ.5 భోజనం పథకాన్ని స్వయంగా పరిశీలించాడు.
జిహెచ్ ఎంసి తరహాలోనే తన నియోజకవర్గంలో కూడ ఈ తరహా భోజనాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు జిహెచ్ ఎం సిలో నిర్వహిస్తున్న భోజన పథకాన్ని పరిశీలించినట్టు చెప్పారు. చెప్పినట్టుగానే తన నియోజకవర్గంలో మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించాడు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మంగళగిరి నియోజకవర్గంలో ఈ క్యాంటీన్లు పేదలకు రూ.4 లకే భోజనాన్ని అందించనున్నారు.
జిల్లాలోని గౌతమిబుద్ద రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ లో తొలి పదిరోజులు, మిగిలినరోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ లో ఈ క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేయనున్నట్టు ఆళ్ళ రామకృష్ణారెడ్డి చెప్పారు.
రూ.4 లకే అన్నం, కూర , పప్పును అందించనున్నారు. 4 రోజుల పాటు కోడిగుడ్డు, మూడు రోజులపాటు అరటిపండు, వడియాలు, వాటర్ ప్యాకెట్ లను అందించనున్నారు. ప్రతిరోజూ మూడు నుండి ఐదువందల మందికి భోజనాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.
అయితే ఈ మొబైల్ క్యాంటీన్లకు ఎమ్మెల్యే తన స్వంత డబ్బులను వెచ్చిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రోజునే ఈ మొబైల్ క్యాంటీన్లను ప్రారంభించినట్టు ఆయన చెప్పారు.
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతోనే రాజన్న క్యాంటీన్ అనే పేరును ఈ మొబైల్ క్యాంటీన్లకు పెట్టారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.అందుకే తాను రాజన్న క్యాంటీన్లను తీసుకువచ్చినట్టు చెప్పారు. త్వరలో రాజన్న క్యాంటీన్లలో టిఫిన్ ను కూడ అందించనున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే.