టి అధికారి ఏపీ సైట్ హ్యాక్ చేశారా?: ‘కాపీ’విచారణకు బాబు సర్కారు నిర్ణయం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల తెరపైకి వచ్చిన'కాపీ' వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 'ఈజ్ ఆఫ్ డూయిగ్ బిజినెస్ (ఈఓడీబీ)'కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్ లోడ్ చేసిన సమాచారం మొత్తం తాము రూపొందించే అని ఆరోపిస్తున్న తెలంగాణ సర్కారు.. చంద్రబాబు సర్కారు తమను కాపీ కొట్టిందని ఆరోపించింది.
అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తాము గత సంవత్సరం రెండో స్థానంలో ఉన్నామని చెబుతున్న ఏపీ సర్కారు... ఇతరులను కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ఏపీ వాదిస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు తాము అప్ లోడ్ చేసిన సమాచారం తమకు కాకుండా ఇతర రాష్ట్రాలకు తెలిసే అవకాశం లేదన్న కొత్త వాదనను ఏపీ ప్రస్తావించింది. తమ వెబ్సైట్లోకి అనధికారికంగా చొరబడిన వ్యక్తులకే ఈ సమాచారం తెలుస్తుందని కూడా వాదిస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణకు చెందిన అధికారులు తమ వెబ్సైట్లోకి చొరబడ్డారని, ఇది ముమ్మాటీకీ హ్యాకింగేనని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న ఏపీ... గురువారం సదరు విచారణకు సంబందించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications