కుప్పం ఎమ్మెల్యే బాబు సమైక్యానికి నిలబడ్తారా: అశోక్
హైదరాబాద్: కుప్పం శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు కట్టుబడుతారో, రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తారో స్పష్టం చేయాలని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీలను త్వరలోనే కలుస్తామని ఆయన చెప్పారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు పార్టీ నేతలకు విభజన అంశం గురించి ముందుగానే తెలుసుననే భావన ప్రజల్లో ఉందని ఆయన చెప్పారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా రాజకీయ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షను తాము భుజాన వేసుకున్నామని అశోక్ బాబు అన్నారు. తమ సమ్మె పట్ల సంతృప్తితో ఉన్నామని, సీమాంధ్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ వివరించగలిగామని ఆయన అన్నారు.
డిసెంబర్ 9 ప్రకటన తర్వాత రాజీనామా చేసిన నేతలు ఇప్పుడు ఎందుకు చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలు రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమ్మెలో భాగంగా సీమాంధ్ర ప్రజల కష్టాలు చూసైనా రాజకీయ నేతల్లో చలనం రాలేదని ఆయన అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications