సీఎం జగన్ నిర్ణయం ..ఆ కులాల వారికి కుల ధృవీకరణ పత్రం లేకున్నా వైఎస్సార్ చేయూత పథకం వర్తింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళుతున్నారు . అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పిన జగన్ వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ,తద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వెయ్యాలని పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే . ఈ పథకం ద్వారా లబ్దిదారులకు మొత్తం 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది . అయితే ఈ పథకం పొందలేకపోతున్న కులాల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు .

నాలుగు కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైయస్సార్ చేయూత పథకం వర్తింపు
వైఎస్సార్ చేయూత పథకంలో నాలుగు కులాల వారికి సంబంధించి ఎదురవుతున్నఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైయస్సార్ చేయూత పథకం వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగు కులాల వారికి కుల ధ్రువీకరణ పత్రం పొందడం లో ఇబ్బందులు ఎదురవు తున్న నేపథ్యంలోనే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

కులధృవీకరణ పత్రం ఇవ్వటంలో ఇబ్బందులు .. జగన్ దృష్టికి తీసుకెళ్ళిన మంత్రులు
ఈ నాలుగు కులాల వారికి కుల దృవీకరణ పత్రాన్ని ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు మంత్రులు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాలలో పథకాన్ని పొందడానికి అర్హులు ఉన్నప్పటికీ కుల దృవీకరణ పత్రం కారణంగా లబ్ధి పొందలేకపోతున్నారని సీఎం దృష్టికి తీసుకుపోగా ఆయన వెంటనే నిర్ణయం తీసుకున్నారు.

స్వయం కుల ధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైయస్సార్ చేయూత పథకం
స్వయం కుల ధ్రువీకరణ పత్రంతోనే అర్హులకు వైయస్సార్ చేయూత పథకం అందించాలని సీఎం ఆదేశించారు. త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. దీంతో అధికారులు లబ్ధిదారుల జాబితా తయారు చేసే పనిలో పడ్డారు. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 25లక్షల మంది మహిళల కోసం ఈ సంవత్సరం 4,700 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గల బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సహాయం అందించనున్నారు.

బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికీ లబ్ది
మొత్తం వారికి 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 12, 2020 నుండి వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సర్కార్ ఇప్పటికే లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ చేసింది . ఇక వీరితో పాటు బుడిగె జంగాలు, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో ఒరియా కులాల వారికీ ఈ పథకం వర్తించనుంది .లబ్దిదారుల జాబితా తయారు చేస్తున్నట్టు వారికి కూడా పథకాన్ని అందించనున్నట్టు సెర్ప్ సిఈఓ రాజాబాబు తెలిపారు .
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications