కడపలో రోడ్డు ప్రమాదం ఐదుగురు మృతి
Recommended Video
కడప:కడప జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటన లో ఐదుగురు మరణించారు. కారు డ్రైవర్ సహ మరో నలుగురు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.కొత్త సంవత్సరం రోజు విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కడప జిల్లాలోని పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

వేంపల్లి నుంచి కడపవైపు కారు వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపై నుంచి వెళ్లిందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇందిరానగర్కు చెందిన లక్ష్మీనరసింహ (14), కార్తీక్ (14), గిరి (15), భాస్కర్ (26) గా గుర్తించారు.
ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications