నాగార్జునకు షాక్ తప్పదా?: కన్వెన్షన్కు త్వరలో నోటీస్
హైదరాబాద్: హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్కు సాధ్యమైన త్వరలో నోటీసులు ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ బుధవారం తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్పందించింది. త్వరలో ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇస్తామని తెలిపింది. ఇందుకోసం న్యాయసలహాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కాగా, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో జీహెచ్ఎంసీకి ఎదురు దెబ్బ తగలగా... ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యానికి బుధవారం ఊరట లభించిన విషయం తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పైన విచారణ బుధవారం ముగిసింది.

యాజమాన్యానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. నోటీసులు ఇచ్చాకే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చర్యలకు ముందు నోటీసులు ఇవ్వాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు సూచించింది. ఎన్ కన్వెన్షన్ సమీపంలోని తుమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్)ను నిర్ధేశించాలని న్యాయస్థానం సూచించింది.
నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం జీహెచ్ఎంసీకి ఉందని అడ్వోకేట్ జనరల్ చెప్పగా... చట్టం ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు హితవు పలికింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications