పట్టాలపై ఆగిన రైలు ఇంజిన్.. పలు రైళ్ల రాకపోకలక అంతరాయం
విశాఖపట్టణం : విశాఖలో ఎలక్ట్రికల్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిగిలిన రెండు ట్రాక్లపై రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. దీంతో దాదాపు మూడు గంటలపాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
శనివారం ఉదయం 8 గంటలకే రైలింజన్ పట్టాలు తప్పింది. ప్రధాన మార్గంలో రైలు ఆగిపోవడంతో .. వెంటనే అధికారులు స్పందించారు. మిగిలిన రెండు ట్రాక్ల గుండా రైళ్లను పంపిస్తున్నారు. తర్వాత ఇంజిన్ను ఉదయం 11 గంటల సమయంలో పట్టాలు ఎక్కించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ట్రాక్పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ షెడ్యూల్ కన్నా మూడుగంటల ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్టణానికి వచ్చే మూడు రైలు మార్గాల్లో ఒకదానిపై ఇంజిన్ పట్టాలు తప్పింది. వెంటనే మరమ్మతు చేపట్టారు అధికారులు. అయితే సూపర్ ఫాస్ట్ రైళ్లు సహా ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు కొన్ని రైళ్లను సమీప స్టేషన్లలో నిలిపివేశారు.

రద్దీగా ఉండే విశాఖ మార్గంలో రైలింజన్ పట్టాలు తప్పడంతో .. మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నిర్ధారిత షెడ్యూల్ కన్నా మూడు గంటల పాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు సుదూర ప్రాంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications