ఉండవల్లి సూచన, బాబు ప్రభుత్వం చెప్పింది చేస్తా!: బీజేపీ మంత్రి
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు సూచించారు. గతంలో కూడా మోడీ గుజరాత్ అవసరాలకు ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు.
హోదాపై మాట్లాడలేను: కామినేని
ప్రత్యేక హోదా విషయమై తాను మాట్లాడలేనని మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస రావు ఆదివారం నెల్లూరు జిల్లాలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. టిడిపి - బిజెపి మైత్రిని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. బిజెపి - టిడిపి మైత్రి ఇలాగే కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు బంద్కు పిలుపివ్వాలి: కొణతాల
ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబు బందుకు పిలుపునివ్వాలని కొణతాల రామకృష్ణ సూచించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా పార్టీలు బందుకు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 2వ తేదీన లేక ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో తేదీన బందుకు పిలుపునివ్వాలని చెప్పారు. బందులు, నిరసనలు జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.












Click it and Unblock the Notifications