ఉండవల్లి సూచన, బాబు ప్రభుత్వం చెప్పింది చేస్తా!: బీజేపీ మంత్రి
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి దీక్ష చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నాడు సూచించారు. గతంలో కూడా మోడీ గుజరాత్ అవసరాలకు ఇలాగే వ్యవహరించారని ఆరోపించారు.
హోదాపై మాట్లాడలేను: కామినేని
ప్రత్యేక హోదా విషయమై తాను మాట్లాడలేనని మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస రావు ఆదివారం నెల్లూరు జిల్లాలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. టిడిపి - బిజెపి మైత్రిని దెబ్బతీయాలని చూస్తున్నాయన్నారు. బిజెపి - టిడిపి మైత్రి ఇలాగే కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు బంద్కు పిలుపివ్వాలి: కొణతాల
ప్రత్యేక హోదా విషయమై సీఎం చంద్రబాబు బందుకు పిలుపునివ్వాలని కొణతాల రామకృష్ణ సూచించారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా పార్టీలు బందుకు పిలుపునిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 2వ తేదీన లేక ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో తేదీన బందుకు పిలుపునివ్వాలని చెప్పారు. బందులు, నిరసనలు జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications