వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన: సుప్రీంకు టిడిపి కేశవ్, అడ్డుకుంటామని టి నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం విభజనపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముందుకు పోతోందని, దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఆర్టికల్ 371 డి పైన కూడా వివరణ ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

విభజనపై కోర్టుకెళ్తామంటే అడ్డుకుంటాం: దయాకర్ రెడ్డి

విభజన తీరు, అన్యాయంపై తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి వేరుగా చెప్పారు. అయితే రాష్ట్ర విభజన పైన కోర్టును ఆశ్రయిస్తామంటే మాత్రం అడ్డుకుంటామన్నారు.

అలా ఎవరు చేసినా వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తమ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు ఎవరు కూడా వ్యక్తిగతమంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని గుర్తు చేశారు.

కాగా, ఈ నెల 25, 26 తేదీల్లో టిడిపి సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలిసే అవకాశముంది. వారి అపాయింటుమెంట్‌ను టిడిపి కోరింది. టిడిపి నేతలు రేపు ఢిల్లీకి బయలుదేరే అవకాశముంది.

English summary
Telugudesam Party senior leader Payyavula Keshav on Wednesday filed a petition over AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X