సీజ్: అప్పు చెల్లించలేదని ట్రాన్స్ట్రాయ్కు బ్యాంక్ గట్టి షాక్, 'పోలవరం'పై ఆందోళన
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్కు గట్టి షాక్ తగిలింది. ఆ కంపెనీ వాహనాలను బ్యాంకర్లు శుక్రవారం సీజ్ చేశారు. పోలవరం సైట్లోని వాహనాలను బ్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. దేనా బ్యాంకుకు రూ.120 కోట్లు ట్రాన్స్ట్రాయ్ బకాయిపడినట్లు తెలిపారు.
మూడేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో వాహనాలను సీజ్ చేశారు. వాహనాలను సీజ్ చేసింది దేనా బ్యాంక్ అధికారులు. దేనా బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.120 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కోర్టు ఆదేశాలతో వాహనాలు సీజ్
శుక్రవారం పోలవరం వద్ద నున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ కార్యాలయానికి దేనా బ్యాంకు ప్రతినిధులు వచ్చారు. వారు కోర్టు ఆదేశాలతోనే తాము వాహనాలు సీజ్ చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. అయితే వాహనాలు సీజ్ చేసే ప్రయత్నాలు మాత్రమే జరిగాయని కూడా అంటున్నారు.
Recommended Video


పోలవరం పనుల నిలిపివేతపై ఆందోళన
ట్రాన్స్ట్రాయ్ వాహనాలను సీజ్ చేస్తే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోతాయేమోనన్న ఆందోళన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. అయితే ఇది ట్రాన్స్ట్రాయ్ సంస్థ ప్రయివేటు వ్యవహారం కావడంతో ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు.

బ్యాంకు అధికారులతో చర్చలు
సీజ్ నేపథ్యంలో ట్రాన్స్టాయ్, దేనా బ్యాంక్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించలేదని, అందువల్లే కోర్టు ఆదేశాలతో తాము వాహనాలను సీజ్ చేసేందుకు వచ్చినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.బాకీలు కట్టలేదని యంత్రాలను సీజ్ చేశారు. అప్పుపై రూ.36 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. రివర్స్ మోర్టగేజ్ కింద వాహనాలను సీజ్ చేశారు.

పోలవరం పనులపై ఆందోళన
కాగా, ట్రాన్స్ట్రాయ్ పైన గతంలోనే కెనరా బ్యాంకు కోర్టుకు ఎక్కింది. ఇప్పుడు దేనా బ్యాంక్ వంతు వచ్చింది. ఈ సంస్థకు ఉన్న అప్పులు, బ్యాంకులు వరుసగా షాకివ్వడం, పనులలో జాప్యం నేపథ్యంలో.. ఈ ప్రభావం పోలవరం ప్రాజెక్టు పనులపై పడుతుందని ప్రభుత్వం ఆందోళనగా ఉంది.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications