ఏపీ బంద్: ఎక్కడికక్కడ నిలిచిన బస్సులు, జగన్ పాదయాత్రకు బ్రేక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం బంద్ పాటిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కడప, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వివిధ ఆర్టీసీ డిపోల ఎదుట ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
విజయవాడలోని నెహ్రూ బస్టాండ్, గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. పలు చోట్ల బస్సులను డిపోల నుంచి రాకుండా అడ్డుకోగా.. తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు. అయితే, తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపునిచ్చారు.

శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం, వామపక్షాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి. బంద్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన శ్రేణులు కూడా పాల్గొంటుయి.
Tirupati: Motorcycle set ablaze near RTC bus stand during statewide bandh called in #AndhraPradesh over the demand of #SpecialStatus for the state pic.twitter.com/0bIyNGU2MW
— ANI (@ANI) April 16, 2018
సోమవారం జరగాల్సిన వివిధ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి. వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కాగా, తిరుపతిలో ఓ ద్విచక్ర వాహనాన్ని ఆందోళనకారులు దగ్ధం చేశారు.
Recommended Video

బంద్ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. బంద్ శాంతియుతంగా చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి హింసకు, విధ్వంసానికి పాల్పడకూడదని చెప్పారు. అన్ని పార్టీలు, ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని అన్నారు. బంద్ లో టీడీపీ పాల్గొనకపోవడం సరికాదన్నారు. చంద్రబాబు కూడా మోడీ బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు.
జగన్ యాత్రకు బ్రేక్
ఏపీ బంద్కు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తను కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు సోమవారం విరామం ఇచ్చారు. బంద్ లో వైసీపీ శ్రేణులు పాల్గొని నిరసనలు వ్యక్తం చేశాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications