Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్టీ మారినా కలిసిరాలేదా, ఆనం సోదరుల భవితవ్యమేమిటీ?

Recommended Video

    తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా ధర్నా చేసిన గూడూరు ప్రజలు | Gudur People Dharna Over The Leather Factory

    నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రాత్రికి రాత్రే రాజకీయాలను మార్చే సత్తా ఉన్న ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలో చేరారు. అయితే టిడిపి నాయకత్వం మాత్రం ఆనం సోదరులకు ఇచ్చినా హమీని నెరవేర్చలేదని ఆనం వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

    అయితే కాలం కలిసిరానందున ఆనం సోదరులు కూడ సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు టిడిపి నాయకత్వం కూడ ఆనం సోదరులకు ఇచ్చిన హమీని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

    ఆనం సోదరుల్లో ఒకరికి త్వరలోనే పదవి దక్కే అవకాశం ఉందని ఆనం వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.ఆనం సోదరులకు మంచి పదవి కోసం ఆయన వర్గీయులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

     ఆనం సోదరులకు కాలం కలిసి రాలేదా

    ఆనం సోదరులకు కాలం కలిసి రాలేదా


    టిడిపిలోకి వచ్చిన తర్వాత ఆనం సోదరులకు పార్టీలో మంచి పదవులను ఇవ్వనున్నట్టు ఆ పార్టీ నాయకత్వం హమీని ఇచ్చిందని ఆనం సోదరుల వర్గీయులు గుర్తు చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల కారణంగా ఆనం వర్గీయులకు మాత్రం పదవులు దక్కలేదు. పదవులు దక్కని కారణంగా ఆనం సోదరులు కొంత టిడిపి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే కాలం కలిసిరాలేదనే కారణంగా ఆనం సోదరులు కూడ కాస్త మౌనంగా ఉంటున్నారని సమాచారం. రాజ్యసభ సభ్యత్వం, ఎమ్మెల్సీ పదవులను ఆనం సోదరులకు కట్టబెడతామని హమీ ఇచ్చిందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

    నెల్లూరులో వైసీపీని దెబ్బతీయడమెలా

    నెల్లూరులో వైసీపీని దెబ్బతీయడమెలా

    నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంటుంది. అయితే వైసీపీని దెబ్బతీయడానికి ఆనం సోదరులకు మంచి పదవిని ఇస్తే ప్రయోజనంగా ఉంటుందని ఆనం వర్గీయులు భావిస్తున్నారు. నెల్లూరు నుండి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.గత ఏడాది ఏప్రిల్ లో మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది.అయితే నెల్లూరులో వైసీపీని దెబ్బతీయడానికి ఆనం సోదరులకు పదవిని టిడిపి నాయకత్వం కట్టబెట్టే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం సాగుతోంది.

    టిడిపి ప్లాన్ ఇలా

    టిడిపి ప్లాన్ ఇలా


    వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని నిలువరించేందుకు చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.2019 ఎన్నికల్లో టిడిపి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహన్ని అమలు చేస్తున్నారు. వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో నేతలను తమ పార్టీల్లోకి ఆహ్వనిస్తున్నారు. కర్నూల్, నెల్లూరు, కడప చిత్తూరు లాంటి జిల్లాల్లో వైసీపీ ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకొని టిడిపి పావులు కదుపుతోంది. అయితే అదే సమయంలో నెల్లూరు జిల్లాల్లో ఆనం సోదరులకు కూడ పదవులను కట్టబెట్టే అవకాశం ఉందని ప్రచారం కూడ లేకపోలేదు

    టిడిపి, బిజెపి నేతల మధ్య సమన్వయం లేదు

    టిడిపి, బిజెపి నేతల మధ్య సమన్వయం లేదు

    నెల్లూరు జిల్లాలో టిడిపి, బిజెపి నేతల మధ్య కూడ సమన్వయం లేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దీని కారణంగా కూడ విపక్ష వైసీపీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే విపక్షాన్ని నిలువరించడంతో పాటు మిత్రపక్షాన్ని కలుపుకొనిపోయేందుకు తీసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వం గుర్తు చేస్తోంది. అయితే ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+