జగన్ పాదయాత్రలో అపశృతి: పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్త మృతి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదటి రోజు అపశృతి దొర్లింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదటి రోజు అపశృతి దొర్లింది.
పాదయాత్రలో పాల్గొన్న వెంకటరమణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. సికేదిన్నెకు (చింతకొమ్మదిమ్మె) చెందిన వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకుంటామని వైసిపి చెప్పింది.

జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇడుపులపాయలోని వైయస్ సమాధి వద్ద జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన అనంతరం పాదయాత్ర మొదలు పెట్టారు.












Click it and Unblock the Notifications