నో కర్ఫ్యూ..? తెలంగాణలో లేదు, ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు స్టార్ట్.. మార్కెట్
కరోనా కేసులు పెరుగుతున్న.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కరోనా కేసుల నేపథ్యంలో కర్ఫ్యూ, స్కూళ్ల సెలవుల పొడగింపు.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభం.. కర్ఫ్యూ విధిస్తే మార్కెట్పై ప్రభావం తదిరత అంశాల గురించి డిస్కష్ చేస్తోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు.. ప్రస్తుత పరిస్థితిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. సమావేశంలో వివరించారు. ఎలాంటి పరిస్థితిని అయిన ఎదుర్కొంటామని చెప్పారు. దీంతో కర్ఫ్యూ విధించడానికి మంత్రివర్గం సానుకూలంగా లేదు. కరోనాను స్వీయ నియంత్రణతోనే తరిమి కొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకు సీఎం కేసీఆర్ పదే పదే.. చెప్పేవారు. మనం పరిశుభ్రంగా.. పరిసరాలు నీట్గా ఉంటే.. ఏ రోగం రాదని చెప్పారు. దానిని మరోసారి చెప్పే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడతారు.

ఫిబ్రవరి 1వ తేదీ వరకు కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో అప్పుడు స్కూల్స్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. సో వారికి అందుకే సెలవులను పొడగించారు. మిగతా వారికి వ్యాక్సినేషన్ జరుగుతున్నందున తప్పడం లేదు. వ్యాక్సినేషన్ పూర్తయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
కర్ఫ్యూ విధిస్తే.. మార్కెట్పై ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుంది. మళ్లీ ఆంక్షలు విధిస్తే.. అన్నీ వర్గాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. అందుకే ఆంక్షలు విధించే విషయంపై ఆచి తూచి నిర్ణయం తీసుకోనుంది. కడపటి సమాచారం మేరకు.. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications