కేసీఆర్ ఆదేశిస్తే గులాబీ దళంలో చేరిక..? వెంకట్రామిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి రాజీనామా.. రాజకీయాల్లోకి రాక అంశాలపై జోరుగా చర్చ జరుగుతుంది. రాజీనామాను వెంటనే ఆమోదించడంతో.. ఆయన మాజీ అయిపోయారు. భవిష్యత్ కార్యచరణ అంశాన్ని సీఎం కేసీఆర్కు వదిలేశారు. ఈ క్రమంలో తను ఏంటో తెలుసు అని.. విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోను అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

విమర్శలకు నో
తనపై విపక్ష పార్టీలు చేసే విమర్శలకు బదులు ఇవ్వనని కుండబద్దలు కొట్టారు. తను ఏంటో తనకు తెలుసు అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్ వైపు ఆకర్షితుడిని అయ్యానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు ఎటువంటి పదవి కూడా ఆశించడం లేదన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి సమయంలో.. ఆయన రాజీనామా చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఖరారు అయ్యిందని.. అందుకే ఐఏఎస్గా రాజీనామా చేశారనే చర్చ కూడా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

రాజీనామా.. ఆమోదం
అంతకుముందు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ సీఎస్ సోమేశ్కుమార్కు రాజీనామా లేఖ అందించారు. వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాలో మాట్లాడుతూ.. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఈ అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వంద సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తానని పేర్కొన్నారు.

ఆయన పేరు ఖరారు
ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటీలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కేసీఆర్కు అత్యంత విధేయుడైన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే లేదా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రేపటితో ముగియనుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది.
Recommended Video

ఇదీ షెడ్యూల్
తెలంగాణలో 19 ఎమ్మెల్సీ స్థాన్థాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల నుంచి 12, ఎమ్మెల్యే కోటాలో 6, గవర్నర్ కోటా నుంచి ఒకస్థానం భర్తీ చేయాల్సి ఉంది. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ వెలువడింది. రేపటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. 17వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చేనెల 22 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 29న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 23వ తేదీన నామినేషన్లకు చివరి తేదీగా పేర్కొన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications