11 వేల మంది బాలికలు అదృశ్యం, కారణమిదే
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంత విద్యాసంస్థల్లో చదువుకొనే సుమారు 11 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని, వారి విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులో ఆమె మాట్లాడారు.గిరిజన బాలికల హస్టళ్ళలో లైంగిక దాడులు, కిడ్నాపులు పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు కూడ పెరిగాయని ఆమె గుర్తు చేశారు.
అయితే వీటిపై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు ఈ మేరకు 2012 చట్టాన్ని సవరించాలని ఆమె సూచించారు.ఈ మేరకు ఛరు.త్తీస్ ఘడ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ కురియన్ సంబంధిత మంత్రిని కోరారు.
బాలికలపై అత్యాచారాలు జరిగిన హస్టళ్ళు ఉంటే విచారణ జరిపి వాటిని మూసివేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications