చైనా వ్యూహాలకు ధీటుగా భారత్ పావులు
డొక్లాం ఇష్యూ అనంతరం భారత్... చైనా వ్యూహాలకు చెక్ చెప్పేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ: డొక్లాం ఇష్యూ అనంతరం భారత్... చైనా వ్యూహాలకు చెక్ చెప్పేలా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
అవసరమైనపుడు అత్యంత వేగంగా సేనలను మోహరించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. డొక్లాం వద్ద చైనా సృష్టించిన అలజడి నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంటోంది.

ఏడాది పొడవునా సైన్యం మోహరించడం కష్టం కాబట్టి
చైనా సరిహద్దుల్లోని తూర్పు లడక్ ప్రాంతంలో మరిన్ని వాయుసేన స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. లడక్లో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. ఏడాది పొడవునా సైన్యాన్ని మోహరించడం సాధ్యం కాదు. సైన్యం ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించడం చాలా కష్టం.

అందుకే వైమానిక స్థావరాలు
అందువల్ల వైమానిక స్థావరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విమానాల్లో ఎక్కువ మంది సైనికులను పంపించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

న్యోమా వైమానిక స్థావరం
న్యోమా వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా కాలంగా కోరుతోంది. సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ స్థావరం అన్ని రకాల రవాణా విమానాలను పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా అభివృద్ధి చేయాలని కోరుతోంది.

1962లో చివరిసారి ఉపయోగించారు
చైనా సరిహద్దుల్లో, తూర్పు లడక్కు సమీపంలో ఈ విమానాశ్రయం ఉంది. దీనిని 1962లో చైనాతో యుద్ధం సమయంలో చివరిసారి ఉపయోగించారు. 2009లో పునరుద్ధరణ పనులు జరిగాయి.

అరుణాచల్ ప్రదేశ్లో అభివృద్ధి చేస్తున్నారు
చూసుల్ వద్ద మరో వైమానిక స్థావరాన్ని అభివృద్ధి చేసేందుకు పరిశీలించినప్పటికీ, ఆ ప్రయత్నాలు ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఏడు అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ ప్రస్తుతం అభివృద్ధిపరుస్తున్నారు. వీటిలో కొన్నిటిని ఇప్పటికే ఉపయోగించుకోవడానికి అనుకూలంగా మార్చారు.
-
దేశవ్యాప్తంగా 300 పాఠశాలలు, 30 ఆసుపత్రులు..భారీ స్థాయిలో అదానీ పెట్టుబడులు -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications