ఫిబ్రవరి 2018లోగా ఆధార్ అనుసంధానించాల్సిందే.. లేకుంటే సిమ్ కార్డులు పనిచేయవు
మొబైల్ సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతి మొబైల్ నెంబరును ఆధార్కు జత చేయడం తప్పనిసరి చేసింది. 2018 ఫిబ్రవరి నాటికి అనుసంధానం పూర్తి చేయకుంటే సిమ్లు పనిచేయవని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: మొబైల్ సిమ్ కార్డుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతి మొబైల్ నెంబరును ఆధార్కు జత చేయడం తప్పనిసరి చేసింది. 2018 ఫిబ్రవరి నాటికి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. గడువులోగా అనుసంధానం పూర్తి చేయకుంటే సిమ్లు పనిచేయవని స్పష్టం చేసింది.
ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు సిమ్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేయాలని కోరుతూ వినియోగదారులకు సందేశాలు పంపుతున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

లోక్నీతి ఫౌండేషన్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మొబైల్ నంబర్లకు ఆధార్ను అనుసంధానించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. తప్పుడు చిరునామాలతో నకిలీ సిమ్కార్డులు తీసుకొని ఉపయోగిస్తున్న నేరస్థులు, మోసగాళ్లు, ఉగ్రవాదులకు అడ్డుకట్ట వేయొచ్చని అధికారులు భావిస్తున్నారు.
సిమ్ కార్డు విక్రయ సమయంలో వినియోగదారుడి ఫింగర్ ప్రింట్ ను బయోమెట్రిక్ విధానంలో తీసుకొని దాన్ని ఆధార్తో సరిపోల్చి నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుంది. మరింకేంటి.. త్వరపడండి.. గడువులోగా మీ సిమ్ కార్డును ఆధార్ తో అనుసంధానించండి!
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications