న్యూఢిల్లీ: అయోధ్య భూవివాదం కేసులో చివరి వాదనలు సుప్రీంకోర్టులో ముగిశాయి. ఇప్పటికే 39 సార్లు అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదంలో కోర్టు వాదనలు వినింది. ఇక చివరి సారిగా అంటే 40వ సారిగా అత్యున్నత న్యాయస్థానం వాదనలు బుధవారం వినింది. దీంతో ఇక అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. తీర్పును అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్లో ఉంచింది. తీర్పుచీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా వస్తుందని భావిస్తున్నారు.
అయోధ్య భూవివాదం కేసును చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది. ఆగష్టు 6 నుంచి రోజువారీగా ఈ విచారణను ఈ బెంచ్ చేపడుతోంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలు హిందూ సంఘాలు ముస్లిం సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. 2.77 ఎకరాల స్థలంను ఆలయ ప్రధాన పూజారి రామ్లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్బోర్డులకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాలు చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక అప్పటి నుంచి కోర్టులోనే కేసు మగ్గుతూ వస్తోంది.
1992 డిసెంబర్ 6వ తేదీన 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం హిందూ ముస్లింల మధ్య గొడవగా మారింది. అయితే అత్యున్నత న్యాయస్థానం మాత్రం అక్టోబర్ 17న వాదనలు వినేందుకు చివరిరోజని ప్రకటించింది. ఇక తీర్పు నవంబర్ 4 లేదా 5వ తేదీల్లో వెలువడే అవకాశం ఉంది.
Oct 16, 2019, 4:54 pm IST
వాదనలు సంతృప్తికరంగా ముగిశాయి.. తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాం: ముస్లిం పార్టీల తరపున లాయర్ జఫర్యాబ్ జిలానీ
Oct 16, 2019, 4:31 pm IST
అనుకున్న సమయం కంటే రెండురోజుల ముందే అయోధ్య కేసులో వాదనలను ముగించిన సుప్రీంకోర్టు. అక్టోబర్ 18న ముగియాల్సి ఉన్న వాదనలు. మిగతావి మరో మూడురోజుల్లో రాతపూర్వకంగా సమర్పించాలని కోరిన సుప్రీంకోర్టు
Oct 16, 2019, 4:30 pm IST
అయోధ్య కేసులో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
Oct 16, 2019, 4:30 pm IST
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంగా ముస్లింలు నష్టపోయారు..ఇక మసీదు పునర్నిర్మాణం చేపట్టేందుకు ముస్లింలకు మాత్రమే అధికారం ఉంటుంది: రాజీవ్ ధవన్
Oct 16, 2019, 4:28 pm IST
నవంబర్ 30 వరకు ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నతాధికారులకు సెలవు రద్దు, అయోధ్యలో హైఅలర్ట్
Oct 16, 2019, 3:58 pm IST
టీవీ చర్చల సందర్భంగా అతివాద అభిప్రాయలకు తావులేకుండా చూడాలని NBSA ఆదేశం
Oct 16, 2019, 3:57 pm IST
సంబరాలు కూడా టెలికాస్ట్ చేయరాదని చెప్పిన NBSA
Oct 16, 2019, 3:57 pm IST
మసీదు కూల్చే దృశ్యాలను టెలికాస్ట్ చేయరాదని చెప్పిన NBSA
Oct 16, 2019, 3:56 pm IST
కోర్టు ప్రొసీడింగ్లపై అత్యుత్సాహం ప్రదర్శించరాదని చెప్పిన NBSA
Oct 16, 2019, 3:56 pm IST
వాదనల సమయంలో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్ అథారిటీ (NBSA)
కొన్ని నిబంధనలను పాటించాలని సూచించింది.
Oct 16, 2019, 3:54 pm IST
భగవంతుడిని బాబర్కు అంటగట్టరాదు, బాబర్ చట్టాలకు లోబడని వ్యక్తి: రాజీవ్ ధవన్
హిందూమహాసభ వాదనల్లో నిజాయితీ లోపించింది: రాజీవ్ ధవన్
Oct 16, 2019, 2:54 pm IST
హిందూ మహాసభ ఎనిమిది సాక్ష్యాలను చూపిస్తోందని అందులో నాలుగు సాక్ష్యాలు ఒకదానితో ఒకటికి పొంతన లేదని కోర్టుకు తెలిపారు రాజీవ్ ధవన్
Oct 16, 2019, 2:50 pm IST
ధవన్కు పేజీలను చింపేయాల్సిందిగా తానే చెప్పినట్లు అంగీకరించిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
Oct 16, 2019, 2:49 pm IST
తాను పుస్తకంలోని పేజీలను చింపివేసినట్లు బయట ప్రచారం జరుగుతోంది. కానీ పేజీలను విసిరేయాలని చూశాను. అయితే చీఫ్ జస్టిస్ చింపేయాల్సిందిగా చెప్పారు. అందుకే కోర్టు అనుమతితోనే పేజీలను చింపేశాను: రాజీవ్ ధవన్
Oct 16, 2019, 2:48 pm IST
హిందూ మహాసభ ఒక స్పష్టమైన వైఖరితో లేదు: రాజీవ్ ధవన్
Oct 16, 2019, 2:41 pm IST
ఇప్పటి వరకు విత్డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఎలాంటి అప్లికేషన్ దాఖలు కాలేదు: సున్నీ వక్ఫ్ బోర్డు లాయరు జఫర్యాబ్ జిలానీ
Oct 16, 2019, 2:37 pm IST
హిందూ మహాసభ స్టాండ్ ఏమిటని ప్రశ్నించిన రాజీవ్ ధవన్
Oct 16, 2019, 2:32 pm IST
1850కి ముందు వివాదాస్పద ప్రాంతంలో నమాజ్ జరగలేదు అని చెబుతూ వచ్చిన పుస్తకాలను కోర్టుకు సమర్పించిన మిశ్రా
Oct 16, 2019, 2:31 pm IST
1856కు ముందు భూమి తమదే అని చెప్పేందుకు ముస్లిం పార్టీల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు చెప్పిన హిందూ పార్టీల తరపున లాయర్ మిశ్రా
Oct 16, 2019, 2:26 pm IST
తన వాదనలు వినిపించేందుకు కోర్టు అనుమతి కోరిన సుబ్రహ్మణ్యన్ స్వామి
Oct 16, 2019, 2:20 pm IST
శ్రీరాముడు నడియాడిన నేల తప్పకుండా తిరిగి వస్తుందనే పూర్తి నమ్మకం మాకుంది: రామాలయం అర్చకుడు
Oct 16, 2019, 2:17 pm IST
భోజన విరామం తర్వాత సుప్రీం కోర్టులో అయోధ్యపై వాదనలు ప్రారంభం
Oct 16, 2019, 2:07 pm IST
ముస్లిం పార్టీల తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ పుస్తకాన్ని కోర్టులో చించివేశారంటే కేసు ఓడిపోయినట్టే అని భావించాల్సి ఉంటుంది: కిషోర్ కునాల్
Oct 16, 2019, 2:06 pm IST
అయోధ్య పై తనకు పూర్తి అవగాహన ఉందన్న అయోధ్య రీ విజిటెడ్ రచయిత మాజీ ఐఏఎస్ అధికారి కిషోర్ కునాల్
Oct 16, 2019, 12:33 pm IST
భోజన విరామం ఇచ్చిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
Oct 16, 2019, 12:20 pm IST
రాజీవ్ ధవన్ చించివేసిన పేజీల్లో శ్రీరాముడు జన్మించిన స్థలంకు సంబంధించిన మ్యాప్ ఉంది
Oct 16, 2019, 12:18 pm IST
ఇక వాదనలు ముగిశాయని నేను భావిస్తున్నాను..ఇక అందరం లేచి వెళదామన్న సీజేఐ రంజన్ గొగోయ్
Oct 16, 2019, 12:16 pm IST
వికాస్ సింగ్ సమర్పించిన పుస్తకంలోని కొన్ని పేజీలను చించివేసిన ముస్లిం పార్టీల తరపున లాయర్ రాజీవ్ ధవన్
READ MORE
10:32 PM, 15 Oct
నవంబర్లో తీర్పు వెలువడే అవకాశం
10:32 PM, 15 Oct
2011 నుంచి అయోధ్య బాబ్రీమసీదు భూవివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు
10:32 PM, 15 Oct
2.77 ఎకరాల స్థలంను రామ్లల్లా, నిర్మోహి అఖారా, సున్నీ వక్ఫ్బోర్డులు సమానంగా పంచుకోవాలంటూ కోర్టు తీర్పు
10:32 PM, 15 Oct
2010 అలహాబాదు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు
10:33 PM, 15 Oct
40వ సారి వాదనలు వింటున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
సుప్రీం కోర్టులో అయోధ్యపై చివరి వాదనలు నేడు జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రచారక్లను హరిద్వార్లో సమావేశం కావాల్సిందిగా పిలపు ఇచ్చిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
8:46 AM, 16 Oct
అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టులో హిందువు పార్టీ ముస్లిం పార్టీల మధ్య వాడీవేడీగా సాగిన వాదనలు
8:47 AM, 16 Oct
అయోధ్య పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న 144 సెక్షన్
8:48 AM, 16 Oct
నవంబర్ 17లోగా అంటే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ చేసేలోగా తీర్పు రాకుంటే మరో బెంచ్కు కేసును బదిలీ చేయడం జరుగుతుంది
8:50 AM, 16 Oct
అయోధ్యలో 100ఎకరాల స్థలంలో అత్యంత పొడువైన శ్రీరాముడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని కొద్దిరోజుల క్రితం ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ విగ్రహం రూ.2500 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం
8:52 AM, 16 Oct
శ్రీరాముడి విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినదిగా ఉంటుంది. దీని ఎత్తు 251 మీటర్లు. చైనాలో గౌతమబుద్ధుడి విగ్రహం ఎత్తు 208 మీటర్లు ఉండగా, ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహం 212 మీటర్లుగా ఉంది.గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎత్తు 183 మీటర్లుండగా ముంబైలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 137.2 మీటర్లుగా ఉంది
10:03 AM, 16 Oct
మొత్తం ఐదు స్లాట్లను కేటాయించిన సుప్రీంకోర్టు. ఒక్కో కేసును 45 నిమిషాల పాటు వాదనలు విననుండగా ఓ కేసుకు మాత్రం గంట కేటాయించింది. మొత్తానికి అయోధ్య కేసులో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు వాదనలు విననున్న సుప్రీంకోర్టు
10:29 AM, 16 Oct
వివాదాస్పద భూమిని మూడు పార్టీల మధ్య సమానంగా పంచాలని 2010లో అలహాబాదు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు కూడా అదే రకమైన తీర్పు ఇస్తే ఇక బంతి ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోతుంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అంశాన్ని ఒకేసారి సెటిల్ చేసే అవకాశం ఉంది
10:31 AM, 16 Oct
హిందువుల వాదన ఏంటి..?
బాబ్రీ మసీదు నిర్మాణం కంటే అక్కడ ముందుగా రాముడి ఆలయం ఉండేదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. ఇదే విషయాన్ని పాశ్చాత్య దేశపు యాత్రికులు కూడా ప్రస్తావించారు. ఇవ్వనీ చూస్తే రాముడి జన్మస్థలం అయోధ్య అని రుజువు చేస్తున్నాయి
10:34 AM, 16 Oct
అయోధ్య కేసులో ట్విస్టు
అయోధ్య భూవివాదం కేసు నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన సున్నీ వక్ఫ్ బోర్డు
10:38 AM, 16 Oct
అయోధ్య కేసు నుంచి వక్ఫ్ బోర్డు తప్పుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన మధ్యవర్తిత్వం ప్యానెల్.. ఇక సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి
10:44 AM, 16 Oct
సుప్రీంకోర్టులో ప్రారంభమైన అయోధ్య భూవివాదం వాదనలు
10:45 AM, 16 Oct
సాయంత్రం 5 గంటల సమయంలోగా అన్ని వాదనలు పూర్తి కావాలన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
10:46 AM, 16 Oct
ఇప్పటివరకు జరిగిన వాదనలు చాలు.. సాయంత్రం 5 గంటలకల్లా ముగించండి: చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
10:47 AM, 16 Oct
సెటిల్మెంట్ అంశంను ప్రస్తావించని సున్నీ వక్ఫ్ బోర్డు
10:48 AM, 16 Oct
కేసులో ఇక ఎవరూ జోక్యం చేసుకోరాదు.. కొత్తగా పిటిషన్లు వేయరాదు అని చెప్పిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
Chief Justice of India (CJI) Ranjan Gogoi while dismissing intervention application of one of the parties Hindu Maha Sabha in #Ayodhya land case: This matter is going to be over by 5 pm today. Enough is enough. https://t.co/wOxgLGEoWB
Chief Justice of India Ranjan Gogoi said that Wednesday would be the last hearing and the 40th hearing on Ayodhya land dispute case. With this all hearings pertaining to the case shall be closed and the judgement would be reserved for November.