పొత్తు ఫైనలైన శివసేన మారలేదు : గోవా విషయంలో బీజేపీని కడిగేసింది
ముంబై : ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన .. బీజేపీ వైఖరిని మరోసారి తప్పుపట్టింది. గోవా సీఎం మనోహర్ పారికర్ ఛితాభస్మం చల్లారకముందే బీజేపీ సీఎం కుర్చీ కోసం రాజకీయాలు చేసిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'ప్రజాస్వామ్యంలో ఓ రాష్ట్రం గడ్డు పరిస్థితికి ఇది నిదర్శనం' అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పారికర్ అస్తికలు బూడిదై ... చల్లారే వరకు కూడా ఆ పార్టీ నేతల ఆగకుండా .. రిసార్టు రాజకీయాలకు తెరతీసి, తమ నైజాన్ని నిరూపించున్నారని మండిపడింది.

అధికారం కోసం వికృత క్రీడలు
ప్రజాస్వామ్యంలో అధికారం కోసం పార్టీలు పాటుపడాలి. కానీ పారికర్ మరణించాక బీజేపీ చేసిన చర్యలు అధికారం కోసం వికృత క్రీడ ఆడినట్టు ఉందని విమర్శించింది. పారికర్ ఛితాభస్మం భూమిలో ఇంకి పోకముందే బీజేపీ చేసిన చర్య హేయనీయమని తన పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పారికర్ మృతి తర్వాత ఆయన సేవలను స్మరించుకోవాల్సిన బీజేపీ నేతలు .. కనీసం మంగళవారం కూడా ఆగలేదని తప్పుపట్టింది. ఈ ప్రక్రియలో బీజేపీ రెండురోజులు ఆగితే సరిపోయేదని గుర్తుచేసింది. అలా చేస్తే బీజేపీ నేతలు కాంగ్రెస్లో చేరేవారా అని ప్రశ్నించింది.

ఎంపిక వెనుక కథ ..?
సీఎంగా ప్రమోద్ సావంత్, డిప్యూటీ సీఎంలుగా విజయ్ సర్దేశాయ్, సుదీన్ దావలికర్ సోమవారం అర్ధరాత్రి ప్రమాణం చేయడంలో ఆంతర్యం ఏంటని నిలదీసింది. వీరిద్దరూ నేతలకు కాంగ్రెస్ పదవులు ఇస్తామని మభ్యపెడుతోందని అనుమానించి .. వికృత క్రీడకు తెరతీసిందని ఫైరయ్యింది. అంతకుముందు పిల్లి, ఎలుకలాగా దాడుగుమూతలు ఆడి .. చివరికి రాత్రి అభ్యర్థులను కన్ఫామ్ చేశారని ఎద్దేవా చేసింది. కానీ గోవా ప్రజలు సర్దేశాయ్, సుదీన్లను డిప్యూటీ సీఎంలుగా భావించడం లేదని, వారిని నియమించే ప్రక్రియేలో ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నది.

అంతా ఊబలాటం ఎందుకు ?
గోవాలో బీజేపీ సభ్యులు తక్కువ ఉన్నా .. ఎంజీపీ, జీఎఫ్పీ సహా ఇండిపెండెంట్ల మద్దతు ఆ పార్టీకే ఉంది. అయితే సోమవారం అర్ధరాత్రే ప్రమాణ స్వీకారం తంతు నిర్వహించడంలో ఆంతర్యం ఏంటీ ? పారికర్ ఆస్తికలు బూడిదకాక ముందే మీరు ఎందుకు తొందరపడ్డారని తీవ్ర స్థాయిలో బీజేపీ వైఖరిని ఎండగట్టింది. అధికారం అంటే ఎందుకంత యావ .. అధికారమే పరమావధా అని ప్రశ్నించింది.

జాతీయ జెండా ఎగురేయలేరా ?
మాజీ రక్షణశాఖ మంత్రి చనిపోతే కేంద్రం సంతాపం ప్రకటించింది. కానీ గోవాలో మాత్రం సంతాపం ఆ దేవుడికేరక మని వ్యాఖ్యానించింది. దేశానికి రక్షణశాఖ మంత్రిగా, గోవా సీఎంగా సేవలు అందించిన పారికర్కు గౌరవసూచకంగా జాతీయ జెండా అవతనం చేయాలనే సోయి కూడా గోవా ప్రభుత్వానికి లేకుండాపోయిందని బీజేపీ వైఖరిని ఎండగట్టింది.
-
విజయ్ ను గెలిపిస్తున్న అన్నామలై?.. లోగుట్టు బయటపెట్టిన సర్వే -
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
మహిళలకు తులం బంగారం హామీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! -
2029లోనూ ఏపీలో ఎవరు గెలవచ్చు ? తేల్చేసిన ఉండవల్లి..! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన!












Click it and Unblock the Notifications