ఐదేళ్లు సీఎం కుర్చీ బీజేపీకే.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో శివసేన మొండి పట్టు పడుతుంటే.. బీజేపీ మాత్రం పట్టాభిషేకానికి రెడీ అవుతోంది. ఆ క్రమంలో బుధవారం నాడే బీజేపీ అసెంబ్లీ శాసనసభా పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఎన్నుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేన ఎమ్మెల్యేలు గురువారం నాడు భేటీ అయి ఎల్పీ లీడర్ను ఎన్నుకునే ఛాన్స్ కనిపిస్తోంది. అదలావుంటే కేంద్రమంత్రి, ఆర్పీఐ నేత రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి కానున్న శివసేన.. అధికారం చెరో సగమంటూ పట్టుబడుతోంది. ఎన్నికల పొత్తులకు ముందే 50-50 ఫార్ములా ఓకే అయిందని వాదిస్తోంది. కానీ బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. సీఎం కుర్చీలో భాగం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఆ మేరకు ఇరు పార్టీల మధ్య కాసింత ప్రతిష్ఠంభన కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

మహారాష్ట్రకు ఐదేళ్ల పాటు పనిచేసే ముఖ్యమంత్రి కావాలని.. ఆ క్రమంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు రాందాస్ అథవాలే. బీజేపీ - శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం ఫడ్నవీస్ ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో ఆయనకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications