రాత్రి 10 గంటల వరకు ఓపెన్.. వ్యాక్సినేషన్ సెంటర్లపై కేంద్రం కీలక ప్రకటన
కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి చెందడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. వైరస్ నివారణ టీకాతోనే సాధ్యం అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు హెల్త్ వర్కర్లు/ వయో వృద్దులు బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. కరోనా వ్యాక్సినేషన్ సమయాన్ని పొడిగించింది. రాత్రి 10 గంటల వరకు వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్ చేసి ఉంచాలని స్పష్టంచేసింది.
వ్యాక్సినేషన్ కోసం జనాలు ఇంట్రెస్ట్ చూపితే రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ డాక్టర్ మనోహర్ అజ్ఞాన్నీ తెలిపారు. ఆయా సెంటర్లకు ఒక సమయం అంటూ ఏదీ లేదని చెప్పారు. దేశంలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే 151.94 కోట్ల మందికి టీకాలను అందజేశారు.

సోమవారం కరోనా కేసులు పెరిగాయి. 1.79 లక్షల కేసులు వచ్చాయి. 4033 ఒమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయి. 7.23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే 146 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 4.83 లక్షలకు చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
కరోనా తోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, మైల్డ్ సింటమ్స్ మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు.కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రముఖులను కూడా కేసులు వదలడం లేదు. హెల్త్ వర్కర్లు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు కరోనా సోకుతుంది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications