డికే. రవి కేసు: మొబైల్ మెసేజ్లు పరిశీలిస్తున్న సీబీఐ?
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి చివరి సారిగా తన స్నేహితురాలు, సాటి మహిళ ఐఏఎస్ అధికారికి వాట్సాప్ లో పంపించిన చివరి సందేశంలో ఏమి ఉందనే విషయాన్ని సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఆరా తీస్తున్నారు. మార్చి 15వ తేది, మార్చి 16వ తేదిన రవి సాటి మహిళ ఐఏఎస్ అధికారికి పంపించిన చివరి మెసేజ్ ను సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

రవి ఉపయోగించిన రెండు మొబైల్స్ సీబీఐ అధికారులకు అప్పగించడానికి సీఐడి అధికారులు సిద్దంగా ఉన్నారు. అదే విధంగా రవి మొబైల్ను పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు ఒక నివేదిక తయారు చేశారు. సీఐడి అధికారులు దర్యాప్తు చేసిన నివేదిక, సైబర్ పోలీసుల నివేదిక, విక్టోరియా ఆసుత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదికను పరిశీలించిన తరువాత పూర్తి స్థాయి విచారణ చెయ్యాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
ఫోరెన్సిక్ నిపుణుల నుండి వచ్చే నివేదిక కేసు దర్యాప్తులో కీలకం కానుంది. రవి ఆత్మహత్య చేసుకొలేదని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. అదే విధంగా ప్రతిపక్షాలు రవిది ఆత్మహత్య కాదని అంటున్నాయి. రవి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసినా అతను విధులలో ఎవరెవరితో గొడవపడ్డారనే విషయాలపై కూడా కూపీ లాగనున్నారు.

రవిని ఎవరైనా బెదిరించారా, విధులు అడ్గుకొవడానికి ప్రయత్నించారా అని పూర్తి వివరాలు సేకరించడానికి సీబీఐ అధికారులు సిద్దమయ్యారు. కోలారులో పని చేసిన 14 నెలలు, ఆ తరువాత బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన సమయంలో రాజకీయ నాయకులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తదితరులు ఎవరెవరు రవిని కలిశారనే వివరాలు సేకరించడానికి సీబీఐ అధికారులు సిద్దమయ్యారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications