అదే జరిగితే ప్రపంచానికి ముప్పే: వాన్నాక్రై తర్వాతి ఎటాక్పై హడలెత్తిస్తోన్న అలర్ట్!
వాన్నక్రై తర్వాతి ఎటాక్ స్మార్ట్ ఫోన్లపై ఉండవచ్చునన్న అనుమానాలతో.. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల సిస్టమ్స్ను హ్యాక్ చేసి.. ఆయా సంస్థల నెట్ వర్క్ ను స్తంభించేలా చేసిన రాన్సమ్ వేర్ ముప్పు మరోసారి పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని, ఏ క్షణంలో అయినా మళ్లీ సైబర్ దాడి జరగవచ్చునని, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహల్ చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లను హ్యాక్ చేసిన రాన్సమ్ వేర్.. తన తర్వాతి టార్గెట్ గా స్మార్ట్ ఫోన్లపై దాడి చేయవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, గత శుక్రవారం రాన్సమ్ వేర్ విసిరిన పంజాకు రెండు లక్షలకు పైగా సిస్టమ్స్ స్తంభించిపోయాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే.. చాలావరకు డెస్క్ టాప్, ల్యాప్ టాప్స్ పనిచేయలేదు.

వాన్నక్రై తర్వాతి ఎటాక్ స్మార్ట్ ఫోన్లపై ఉండవచ్చునన్న అనుమానాలతో.. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. స్మార్ట్ ఫోన్లలో ఎక్కువమంది ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ సిస్టమ్ కావడంతో.. దీనిపై గనుక హ్యాకర్లు దాడి చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు కష్టాలు మొదలైనట్లే.
తర్వాతి ఎటాక్ కు సంబంధించి.. రైల్వేలు, బ్యాంకులు, పవర్ యుటిలిటీస్, ఇతర ప్రొవైడర్లకు ఇప్పటికే సమాచారం అందించామని సంజయ్ తెలిపారు. దీనికి సంబంధించిన అలర్ట్ లను పంపిస్తున్నామని అన్నారు. వాన్నక్రై ఎటాక్ పై అధ్యయనం చేయడానికి ఓ స్పెషల్ టీమ్ ను కూడా నియమించినట్లు తెలిపారు.
హ్యాకర్లు గనుక స్మార్ట్ ఫోన్లపై పంజా విసిరితే.. ప్రపంచం విలవిలలాడిపోవడం ఖాయం. వ్యక్తిగత సమాచారం నుంచి, ఆర్థిక లావాదేవీల వరకు చాలామంది స్మార్ట్ ఫోన్లలో సమాచారం నిక్షిప్తం అయి ఉంటుంది కాబట్టి.. ఆ డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంటుంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications