నేపాల్ భూకంపం: ఎయిర్ ఫోర్స్పై సచిన్, ప్రధాని మోడీ ట్వీట్లు
న్యూఢిల్లీ: నేపాల్ భూకంప బాధితులకు సహాయం అందిస్తున్న భారత ఎయిర్ ఫోర్స్ సేవలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొనియాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలు అమోఘం అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పలువురు భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని కితాబిచ్చారు.
ఓ వైపు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దైర్యంతో పని చేస్తున్నాయన్నారు. భూకంప ప్రాంతంలో చిక్కుకు పోయిన 1900 మందిని ఇప్పటి వరకు వారు తసుకు వచ్చారని కొనియాడారు.
Great relief work being done by the Indian Air Force. Have brought back over 1900 stranded Indians by flying sorties braving the bad weather
— sachin tendulkar (@sachin_rt) April 27, 2015 ఇండియన్ ఆర్మీపై ప్రధాని మోడీ
భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న నేపాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఆర్మీకి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఇతరులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. నేపాల్లో సంభవించిన విపత్తుపై వెంటనే స్పందించి ఆదేశంలో సహాయ చర్యలు చేపట్టినందుకు గాను మోడీపై ప్రశంసలు కురిపిస్తూ దేశ, విదేశాల నుంచి పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
We must thank our armed forces, NDRF teams, doctors & all those volunteers who are overcoming every obstacle to restore normalcy in Nepal.
— Narendra Modi (@narendramodi) April 27, 2015 ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ప్రధాని మోడీ నేపాల్ను యాథాతథ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, వైద్యులు, వాలెంటర్లీకు నిజమైన అభినందలు తెలపాలని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మీడియా ధైర్యంగా గ్రౌండ్ నుండి కవరేజ్ ఇస్తోందని కితాబిచ్చారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications