హల్వా వండిన జైట్లీ, వందమందికి పైగా అధికారులను లాక్ చేశారు!
కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రారంభ సూచకంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు గురువారం హల్వా వంటకంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రారంభ సూచకంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు గురువారం హల్వా వంటకంలో పాల్గొన్నారు. ఆర్థిక కార్యదర్శి అశోక్ లవాసా, రెవెన్యూ కార్యదర్శి హన్ముఖ్ అధియా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ పాల్గొన్నారు.
తద్వారా, 2017-18 వార్షిక బడ్జెట్ ప్రతుల ముద్రణ పనులకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎప్పటిమాదిరిగానే ఆనవాయితీగా వస్తున్న హల్వా వేడుకను ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో నిర్వహించారు.

చాలా ఏళ్ల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయంలో హల్వాను తయారు చేసి, ఆర్థిక శాఖలోని మొత్తం సిబ్బందికి పంచుతారు. హల్వా వేడుక అనంతరం బడ్జెట్ ప్రసంగం వరకూ, 100కు పైగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ముద్రణాలయంలోనే ఉండిపోతారు.
వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. బడ్జెట్లోని అంశాలను రహస్యంగా ఉంచేందుకు ఇలా చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్లు, ఇ-మెయిల్, ఇతర ఏ రూపంలోనైనా సమాచారం చేరేవేసే వీలుండదు. బడ్జెట్ రోజు వరకు వీరు ఇంటికి సైతం వెళ్లకూడదు. ఆర్థిక శాఖ కొంతమంది ఉన్నతాధికారులకు మాత్రం ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications