జియో డౌన్: అనేబుల్ టు కాల్, ఎస్సెమ్మెస్..5జీ ఎలా అంటూ యూజర్ల కొశ్చన్స్
జియో సేవలకు అంతరాయం కలిగింది. దేశవ్యాప్తంగా కొందరికీ టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. కొందరికీ నిన్నటి నుంచే సమస్య వచ్చింది. ఇష్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునేందుకు నెట్ వర్క్ పనిచేయడం లేదు. ఇంటర్నెట్ బ్రౌజింగ్లో సమస్య ఉందని యూజర్లు అంటున్నారు.
వోల్ట్ సింబల్ ఉదయం నుంచి కనిపించడం లేదు. దీంతో కాల్స్ చేసుకోలేని పరిస్థితి ఉంది. క్యాజువల్ కాల్స్కే సమస్య వస్తోంది. కొందరు యూజర్లకు ఇంటర్నెట్ బ్రౌజింగ్లో సమస్య వస్తోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు జియో నెట్ వర్క్ లో సమస్యలు ఎదురైంది.
37 శాతం మంది యూజర్లు తమకు సిగ్నల్ రావడం లేదని మొబైల్ నెట్ వర్క్లో సమస్యను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ పోర్టల్ చెబుతోంది. 37 శాతం మంది కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోలేకపోతున్నారని పేర్కొంది. 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్లో సమస్య ఉందని చెబుతున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా నుంచి యూజర్లు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
4జీ సేవలకే ఇలా అంతరాయం కలిగితే.. ఇక 5జీ ఎలా ఇస్తారని కొందరు అడుగుతున్నారు. వాస్తవానికి దేశంలో జియో 5జీ సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఇంతలోనే సమస్య వచ్చింది. 5జీ అప్ గ్రేడ్ అవుతున్న సమయంలో.. కొన్నిసార్లు కాల్స్ కూడా సమస్య వచ్చింది. మళ్లీ కాల్ కట్ చేసి చేయాల్సి వస్తోంది.