వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో నీటమునిగిన మసీదు: దేవాలయంలో ముస్లీంల ప్రార్థనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

హిందూ ఆలయంలో ముస్లీంల ప్రార్థనలు

తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎన్నో మసీదులు, చర్చిలు నీట మునిగాయి. బుధవారం ముస్లీంల పండుగ బక్రీద్. దీంతో మసీదులలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకపోయింది. దీంతో వారి కోసం ఆలయాలను తెరిచారు.

కేరళ వరదలు: యూఏఈ రూ.700 కోట్ల సాయానికి కేంద్రం నో! ఎందుకు వద్దంటోంది?కేరళ వరదలు: యూఏఈ రూ.700 కోట్ల సాయానికి కేంద్రం నో! ఎందుకు వద్దంటోంది?

తద్వారా ఆలయాలు, ఆలయ నిర్వాహకులు మానత్వాన్ని, మంచితనాన్ని చాటారు. మాలా సమీపంలోని ఎరవతూర్‌లో గల పురపిల్లిక్కవ్ రక్తేశ్వరి ఆలయంలో ముస్లీంకు ప్రార్థనలు చేసుకునేందుకు చోటు కల్పించారు ఆలయ నిర్వాహకులు. సమీపంలోని కొచుకదేవ్ మహల్ మసీదు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో వారు ఆలయంలో ప్రార్థనలు చేసారు.

Mosque Under Water, Kerala Temple Opens Its Doors to Muslims For Eid Prayers

ఈ ఆలయాన్ని నారాయణ ధర్మ పరిపాలన యోగమ్ (ఎస్ఎన్డీపీ) చూస్తోంది. దీని ఆధ్వర్యంలో కేరళ వరదల నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయ, సహకారాలు చేపడుతున్నారు.

ఆలయంలో ఇప్పటికే రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. చాలామంది నిరాశ్రయులు ఆలయంలో ఉన్నారు. దీంతో ముస్లీంలకు ప్రార్థనలు చేసుకునేందుకు మొదట చోటు దక్కలేదు. దీంతో ఆలయానికి చెందిన వారు కొందరు ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి, ఎవరికీ ఇబ్బంది కాకుండా వారు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇక్కడ దాదాపు 300 మంది ప్రార్థనలు చేశారు.

English summary
In yet another example of communal harmony, a Hindu temple in Kerala opened its doors for Muslims to conduct Eid prayers on Wednesday as the mosque nearby was inundated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X