కేరళలో నీటమునిగిన మసీదు: దేవాలయంలో ముస్లీంల ప్రార్థనలు
Recommended Video

తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఎన్నో మసీదులు, చర్చిలు నీట మునిగాయి. బుధవారం ముస్లీంల పండుగ బక్రీద్. దీంతో మసీదులలోకి వెళ్లి ప్రార్థనలు చేసుకునేందుకు వారికి అవకాశం లేకపోయింది. దీంతో వారి కోసం ఆలయాలను తెరిచారు.
తద్వారా ఆలయాలు, ఆలయ నిర్వాహకులు మానత్వాన్ని, మంచితనాన్ని చాటారు. మాలా సమీపంలోని ఎరవతూర్లో గల పురపిల్లిక్కవ్ రక్తేశ్వరి ఆలయంలో ముస్లీంకు ప్రార్థనలు చేసుకునేందుకు చోటు కల్పించారు ఆలయ నిర్వాహకులు. సమీపంలోని కొచుకదేవ్ మహల్ మసీదు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీంతో వారు ఆలయంలో ప్రార్థనలు చేసారు.

ఈ ఆలయాన్ని నారాయణ ధర్మ పరిపాలన యోగమ్ (ఎస్ఎన్డీపీ) చూస్తోంది. దీని ఆధ్వర్యంలో కేరళ వరదల నేపథ్యంలో పెద్ద ఎత్తున సహాయ, సహకారాలు చేపడుతున్నారు.
ఆలయంలో ఇప్పటికే రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. చాలామంది నిరాశ్రయులు ఆలయంలో ఉన్నారు. దీంతో ముస్లీంలకు ప్రార్థనలు చేసుకునేందుకు మొదట చోటు దక్కలేదు. దీంతో ఆలయానికి చెందిన వారు కొందరు ముందుకు వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి, ఎవరికీ ఇబ్బంది కాకుండా వారు ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇక్కడ దాదాపు 300 మంది ప్రార్థనలు చేశారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications