నిర్భయకు చికిత్స చేసిన నర్స్పై రాత్రంతా గ్యాంగ్ రేప్
పంజాబ్లోని మాన్సా జిల్లాలో నర్సుపై ఏడుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. గుర్నా అనే గ్రామంలోని ట్యూబ్వెల్ షెడ్లో 33 ఏళ్ల నర్సుపై సోమవారం రాత్రంతా కీచక పర్వం కొనసాగినట్లు చెబుతున్నారు.
ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని బల్వీందర్ సింగ్ కాలా, మన్వీందర్లుగా గుర్తించారు. అయితే, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బాధితారులు నిరాకరించినట్లు సమాచారం.
నిందితుల్లో ఒకరు బాధితురాలికి పరిచయమని వార్తాకథనాలు చెబుతున్నాయి. ఆమె స్నేహితురాలి భర్త ఆమెను బుధ్లాడా రైల్వే స్టేషన్లో కలుసుకుని, ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసికెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సామూహిక అత్యాచారం చేసి తిరిగి రైల్వే స్షేషన్లో వదిలేశారు. ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.
తన భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున పంజాబ్కు రావాలని స్నేహితురాలి భర్త ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ఆమె ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.