వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్భయకు చికిత్స చేసిన నర్స్‌పై రాత్రంతా గ్యాంగ్ రేప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nurse, who treated Nirbhaya, gang-raped in Punjab
చండీగఢ్: ఢిల్లీ సామూహిక అత్యాచార బాధితురాలు నిర్భయకు చికిత్స అందించిన ఓ నర్సుపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లో నిర్భయకు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో సేవలు చేసిన నర్సుల్లో ప్రస్తుత బాధితురాలు ఉంది. ఈ మేరకు బుధవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో నర్సుపై ఏడుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. గుర్నా అనే గ్రామంలోని ట్యూబ్‌వెల్ షెడ్‌లో 33 ఏళ్ల నర్సుపై సోమవారం రాత్రంతా కీచక పర్వం కొనసాగినట్లు చెబుతున్నారు.

ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని బల్వీందర్ సింగ్ కాలా, మన్వీందర్‌లుగా గుర్తించారు. అయితే, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బాధితారులు నిరాకరించినట్లు సమాచారం.

నిందితుల్లో ఒకరు బాధితురాలికి పరిచయమని వార్తాకథనాలు చెబుతున్నాయి. ఆమె స్నేహితురాలి భర్త ఆమెను బుధ్‌లాడా రైల్వే స్టేషన్‌లో కలుసుకుని, ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసికెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సామూహిక అత్యాచారం చేసి తిరిగి రైల్వే స్షేషన్‌లో వదిలేశారు. ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.

తన భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున పంజాబ్‌కు రావాలని స్నేహితురాలి భర్త ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అందువల్లనే ఆమె ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

English summary
A nurse, who treated 2012 Delhi gang-rape victim 'Nirbhaya' at Safdarjung hospital, was allegedly sexually assaulted by seven men in Punjab's Mansa district, reports said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X