సుప్రీంకోర్టు సీజే అభిశంసన కోరుతూ విపక్ష ఎంపీల నోటీసు
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీ.జె దీపక్ మిశ్రాను అభిశంసించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు సీజేను అభిశంసించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు శుక్రవారం నాడు నోటీసు అందజేశారు.
సిబిఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసుపై స్వతంత్ర దర్యాప్తును అవసరం లేదని సుప్రీం కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది. దరిమిలా విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు శుక్రవారం నాడు సమావేశమై ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ఏడు పార్టీలకు చెందిన సుమారు 64 మంది ఎంపీలు సుప్రీంకోర్టు సీజేను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు నోటీసును ఇచ్చారు.
కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, సిపిఐ, సమాజ్వాదీ పార్టీ, బిఎస్పీ, ముస్లిం లీగ్ పార్టీల ఎంపీలు ఈ నోటీసుపై సంతకం చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై ఐదు అంశాల్లో తప్పుడు ప్రవర్తనకు సంబంధించిన అంశాలను ఈ నోటీసులో పొందుపర్చినట్టుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ తెలిపారు.
ఈ ఏడాది జనవరి 12వ తేదిన సుప్రీంకోర్టుకు చెందిన కొందరు నలుగురు జడ్జీలు కొన్ని అంశాలను బహిరంగంగానే మీడియాలో ప్రస్తావించారు. అయితే ఈ అంశాలు ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆయన కపిల్ సిబల్ చెప్పారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications