సుప్రీంకోర్టు సీజే అభిశంసన కోరుతూ విపక్ష ఎంపీల నోటీసు
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సీ.జె దీపక్ మిశ్రాను అభిశంసించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు విపక్ష పార్టీలకు చెందిన 64 మంది ఎంపీలు సీజేను అభిశంసించాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు శుక్రవారం నాడు నోటీసు అందజేశారు.
సిబిఐ ప్రత్యేక జడ్జి జస్టిస్ లోయా మృతి కేసుపై స్వతంత్ర దర్యాప్తును అవసరం లేదని సుప్రీం కోర్టు గురువారం నాడు తీర్పు వెలువరించింది. దరిమిలా విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు శుక్రవారం నాడు సమావేశమై ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ఏడు పార్టీలకు చెందిన సుమారు 64 మంది ఎంపీలు సుప్రీంకోర్టు సీజేను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడుకు నోటీసును ఇచ్చారు.
కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఎం, సిపిఐ, సమాజ్వాదీ పార్టీ, బిఎస్పీ, ముస్లిం లీగ్ పార్టీల ఎంపీలు ఈ నోటీసుపై సంతకం చేశారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై ఐదు అంశాల్లో తప్పుడు ప్రవర్తనకు సంబంధించిన అంశాలను ఈ నోటీసులో పొందుపర్చినట్టుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ తెలిపారు.
ఈ ఏడాది జనవరి 12వ తేదిన సుప్రీంకోర్టుకు చెందిన కొందరు నలుగురు జడ్జీలు కొన్ని అంశాలను బహిరంగంగానే మీడియాలో ప్రస్తావించారు. అయితే ఈ అంశాలు ఇంతవరకు పరిష్కారం కాలేదని ఆయన కపిల్ సిబల్ చెప్పారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications