'నమో'స్తే లండన్: బ్రిటన్ పర్యటనకు ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మూడు రోజుల పాటు యునైటెడ్ కింగ్డమ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.
బ్రిటన్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్తో విస్తృత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
బ్రిటన్ పారిశ్రామిక వేత్తలతో మోడీ సమావేశమవుతారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ల్యాండ్ రోవర్ ప్లాంట్ను నరేంద్ర మోడీ సందర్శించనున్నారు.
వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. టర్కీలో జరిగే జి-20 సదస్సుకు మోడీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.
Leaving
for
UK.
I
am
hopeful
this
visit
will
strengthen
economic
ties
between
India
and
UK
&
bring
more
investment
to
India.
#makeinindia
—
Narendra
Modi
(@narendramodi)
November
12,
2015