షాకింగ్: బంధువులొచ్చారని హల్వా చేస్తే.. అది తిని ఐదుగురు మరణించారు!
జైపూర్: ఇంటికి బంధువులు రావడంతో ఓ కుటుంబం వేడివేడిగా హల్వా తయారు చేసి వచ్చిన వారికి వడ్డించింది. అంతే - ఆ హల్వా తిని ఐదుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రాజస్థాన్ భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... బంధువుల ఇంటికెళ్లి సరదాగా గడిపిరావాలనుకున్నారు కొంతమంది వ్యక్తులు. భుటేలా గ్రామంలోని బంధువుల ఇంటికెళ్లారు.
రాకరాక బంధువులు రావడంతో ఆ కుటుంబం కూడా సంతోషపడింది. ఆ ఆనందంలో వారు హల్వా తయారు చేసి వేడివేడిగా వడ్డించారు. కానీ దురదృష్టం.. ఆ హల్వాను ఆరగించి ఐదుగురు మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఫుడ్ పాయిజన్ కారణంగానే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొనడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.