అంబేడ్కర్ కంటే ముందే మదర్ థెరిస్సాకు భారతరత్న ఎందుకిచ్చారు: ఆరెస్సెస్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మదర్ థెరిస్సాల విషయమై కొత్త విషయాన్ని చెప్పింది! అంబేడ్కర్ను అనేక ఏళ్ల పాటు విస్మరించారని ఆరెస్సెస్ మండిపడింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను అంబేడ్కర్ కంటే ముందే థెరిస్సాకు ఎందుకిచ్చారని ప్రశ్నించింది.
అంబేడ్కర్ 124వ జయంతి సందర్భంగా ఆయనను ఆరెస్సెస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్తో ఆరెస్సెస్ పోల్చింది. 370వ అధికరణ పైన వారిద్దరికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది. ఆరెస్సెస్ పత్రికలైన ఆర్గనైజర్, పాంచజన్య ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి మాట్లాడారు.

అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం ఎంతో పోరాడారని చెప్పారు. ఆయనకు 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం హయాంలో భారతరత్న ఇచ్చారని, అంతకు పదేళ్ల ముందే అంటే.. 1980లోనే థెరిస్సాకు భారత అత్యున్నత పురస్కారం ఇచ్చారని విమర్శించారు. నాటి ప్రభుత్వాలు అంబేడ్కర్ను విస్మరించాయనేందుకు ఇదే నిదర్శనమని ఆరెస్సెస్ అభిప్రాయపడింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications