షాక్:వచ్చే 2 ఏళ్ళలో 10% తగ్గనున్న ఎస్బీఐ ఉద్యోగులు, రిక్రూట్ మెంట్ కూడ తక్కువే
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బి ఐ ఉద్యోగులను తగ్గించనుంది. మరో రెండేళ్ళలో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ఎస్ బి ఐ ఎండీ రాజ్ నీశ్ కుమార్ చెప్పారు.
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్ బి ఐ ఉద్యోగులను తగ్గించనుంది. మరో రెండేళ్ళలో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ఎస్ బి ఐ ఎండీ రాజ్ నీశ్ కుమార్ చెప్పారు.
ఎస్ బి ఐలో ఇప్పటికే 2,07,000 మంది ఉద్యోగులున్నారు. ఏప్రిల్1వ, తేదిన ఎస్ బి ఐ మరో ఆరు సంస్థలను అనుబంధం చేసుకోనుంది.

దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,77,000 లకు పెరగనుంది.ఈ నేపథ్యంలో అనుబంధ సంస్థల కారణంగా కొత్త సమస్యలు రాకుండా మార్చి 2019 నాటికి పది శాతం ఉద్యోగులను తొలగించాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు ఆ సంస్థకు చెందిన ఉన్నత ఉద్యోగులు చెప్పారు.
సంస్థల అనుబంధం తరవాత జరగబోయే పరిణామాలను బట్టి మిగిలిన మార్పులు జరుగుతాయని సంస్థ ఉన్నతవర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఎస్ బీ ఐ లో కొత్త ఉద్యోగులను తీసుకోవడమనేది 50 శాతం తగ్గే అవకాశం ఉందని ఎస్ బి ఐ లోని ఉన్నతవర్గాలు చెప్పాయి.
ప్రతి ఏటా ఐదు వేల నుండి ఆరువేలమందిని తీసుకొంటున్నామని అయితే రానున్న రోజుల్లో ఇది యాభై శాతానికి తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా ఎస్ బి ఐ శాఖల విస్తీర్ణం కూడ చేయనున్నామని ఏటా కొత్త బ్రాంచీలను తెరుస్తూనే ఉంటామని ఎస్ బి ఐ లోని ఉన్నత వర్గాలు వెల్లడించాయి.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications