ఏకే-47 గన్స్తో వచ్చి.. తోకముడిచిన పాక్ ఉగ్రవాదులు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని సంజువాన్లో ఉగ్రదాడి ఘటన మరువకముందే పాకిస్తాన్ ముష్కరులు మరో పన్నాగం పన్నారు. సోమవారం ఉదయం సరిహద్దులు దాటి వచ్చి శ్రీనగర్లోని సీఆర్పీఎఫ్ క్యాంపులోకి జొరబడ్డారు. వారి వద్ద ఏకే-47 ఆయుధాలు, పెద్ద పెద్ద బ్యాగులు ఉన్నాయి. వచ్చీ రాగానే వారు తమ తుపాకులకు పనిచెప్పారు.
ఉన్నట్లుండి ఒక్కసారిగా వారు సీఆర్పీఎఫ్ క్యాంపుపై కాల్పులకు తెగబడడంతో మన భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో తట్టుకోలేక ఆ ఇద్దరు పాక్ ఉగ్రవాదులు తోకముడిచారు.

ఇద్దరు ఉగ్రవాదులు ఏకే 47లు, బ్యాగులతో సీఆర్పీఎఫ్ క్యాంపును సమీపించారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల కాల్పుల ధాటికి తట్టుకోలేక కొన్ని క్షణాల్లోనే ఆ ఉగ్రవాదులు పరారయ్యారని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే వారికోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం కూంబింగ్ జరుగుతోందని చెప్పారు.
మరోవైపు ఇటీవల సంజువాన్లో జరిగిన ఉగ్రదాడిలో ఒక పౌరుడు, ఐదుగురు ఆర్మీ సిబ్బందితో కలిపి మొత్తం ఆరుగురు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులో కూడా కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు, ఇతర సంస్థల ఉగ్రవాదులు తరచూ సైనిక దుస్తుల్లో భారత్లో ప్రవేశించి దాడులకు తెగబడుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications