పాఠశాలలో కాల్పులు జరిపిన విద్యార్థులు: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్లోని ఓ పాఠశాలలో ఓ విద్యార్థి, అతడి టీనేజి సోదరుడు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. పాఠశాలలో రెండు గ్రూపుల మధ్య తాగాదా, ఘర్షణలతో వారు కాల్పులకు పాల్పడినట్లు తెలిపారు.
అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. కాల్పులకు తెగబడిన పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బిజ్నోర్ జిల్లా ధామ్పూర్ వద్ద ట్రక్కు-వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
మొరాబాద్కు చెందిన వీరు వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ధామ్పూర్ పోలీసు అధికారి హరేంద్ర యాదవ్ వెల్లడించారు. వ్యాన్ డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు చెప్పారు.
పెళ్లి వ్యాను బోల్తా..15 మందికి గాయాలు
కరీంనగర్: జిల్లాలోని కోరుట్ల శివారులో ఓ పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను రుద్రాంగి నుంచి మందమర్రి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications