వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వధువు బట్టలిప్పించి!: మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఘోర అవమానం..

వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు.

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: మరికొద్ది గంటల్లో పెళ్లి తంతు పూర్తవుతుందనగా.. ఓ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వధువుకు సంబంధించి కొన్ని వదంతులు వ్యాపించడంతో.. ఆమెను వివస్త్ర చేసి మరీ వరుడు తరుపు ఆడపడుచులు తనిఖీలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం నాడు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న సమయంలో.. వధవుకు ల్యూకోడర్మా అనే చర్మ వ్యాధి ఉందన్న వదంతులు వ్యాపించాయి. విషయాన్ని వరుడి తరుపువారికి చెప్పకుండా దాచారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

UP bride made to strip after skin disease rumours

ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగ్గా.. పంచాయితీ కాస్త పోలీసుల దాకా వెళ్లింది. వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆమెకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని తేలడంతో.. తిరిగి పెళ్లి మంటపానికి చేరుకుని, వివాహ తంతు కానిచ్చారు.

English summary
A woman was allegedly forced to strip in front of the women of her groom's family in Uttar Pradesh's Mahoba district on account of a rumour that she was suffering from leukoderma, which causes white patches on the skin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X