వధువు బట్టలిప్పించి!: మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఘోర అవమానం..
వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు.
కాన్పూర్: మరికొద్ది గంటల్లో పెళ్లి తంతు పూర్తవుతుందనగా.. ఓ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వధువుకు సంబంధించి కొన్ని వదంతులు వ్యాపించడంతో.. ఆమెను వివస్త్ర చేసి మరీ వరుడు తరుపు ఆడపడుచులు తనిఖీలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం నాడు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న సమయంలో.. వధవుకు ల్యూకోడర్మా అనే చర్మ వ్యాధి ఉందన్న వదంతులు వ్యాపించాయి. విషయాన్ని వరుడి తరుపువారికి చెప్పకుండా దాచారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగ్గా.. పంచాయితీ కాస్త పోలీసుల దాకా వెళ్లింది. వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆమెకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని తేలడంతో.. తిరిగి పెళ్లి మంటపానికి చేరుకుని, వివాహ తంతు కానిచ్చారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications