వధువు బట్టలిప్పించి!: మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఘోర అవమానం..
వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు.
కాన్పూర్: మరికొద్ది గంటల్లో పెళ్లి తంతు పూర్తవుతుందనగా.. ఓ వధువుకు తీవ్ర అవమానం జరిగింది. వధువుకు సంబంధించి కొన్ని వదంతులు వ్యాపించడంతో.. ఆమెను వివస్త్ర చేసి మరీ వరుడు తరుపు ఆడపడుచులు తనిఖీలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహోబా జిల్లాకు చెందిన జైహింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం నాడు పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్న సమయంలో.. వధవుకు ల్యూకోడర్మా అనే చర్మ వ్యాధి ఉందన్న వదంతులు వ్యాపించాయి. విషయాన్ని వరుడి తరుపువారికి చెప్పకుండా దాచారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇదే విషయంపై ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదనలు జరగ్గా.. పంచాయితీ కాస్త పోలీసుల దాకా వెళ్లింది. వధువును సైతం పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు.. వరుడు తరుపు మహిళలతో ఆమెను తనిఖీ చేయించారు. స్టేషన్ లోని ఒక గదిలోకి పంపించి.. ఆమెను వివస్త్రను చేయించి తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఆమెకు ఎలాంటి చర్మ వ్యాధి లేదని తేలడంతో.. తిరిగి పెళ్లి మంటపానికి చేరుకుని, వివాహ తంతు కానిచ్చారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications