Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక చెక్కుల రూపంలో వేతనాలు... చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర

పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఇకపై తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం అమలులోకి వచ్చింది.

న్యూఢిల్లీ: పారిశ్రామిక, వ్యాపార సంస్థలు ఇకపై తమ ఉద్యోగులకు వేతనాలను చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం అమలులోకి వచ్చింది.

వేతనాల చెల్లింపులకు సంబంధించి ఈ నూతన విధానానికి ఉద్దేశించిన వేతన చెల్లింపు (సవరణ) చట్టం-2017కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. వేతనాల చెల్లింపుల్లో నగదు రహిత విధానాలు పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలకు నిర్దేశించేందుకు ఈ చట్టం దోహదపడుతుంది.

president pranab

అంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం తొలుత డిసెంబర్ 28న దీనికి సంబంధించి ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది.

అనంతరం ఫిబ్రవరి 7న లోక్ సభ, ఆ తరువాతి రోజు రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ చట్టం ద్వారా ఇకపై ఆయా సంస్థలు చెక్కులు లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వేతన చెల్లింపుల చట్టం-1936కు కూడా అవసరమైన మార్పులు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+