నా ప్రాణం పోయినా రాష్ట్రం ముక్కలు కాదు, తండ్రి, కోడుకుల స్వార్థం: బీజేపీ నో, బెంగళూరు!
బెంగళూరు: సమైక్య కర్ణాటక ముక్కలు కావడానికి తాను అంగీకరించనని, చివరి శ్వాస ఉన్నంత వరకు ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయ్యకుండా అడ్డుకుంటానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీఎస్ యద్యూరప్ప అన్నారు. సమైక్య కర్ణాటకకు బీజేపీ కట్టుబడి ఉందని యడ్యూరప్ప స్పష్టం చేశారు.

తండ్రీ కోడుకుల ప్లాన్
మంగళవారం హుబ్బళిలో మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ మీద మండిపడ్డారు. జేడీఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి తండ్రీ కోడుకులు కర్ణాటకను ముక్కలు చెయ్యడానికి సిద్దం అయ్యారని యడ్యూరప్ప ఆరోపించారు.

ఏ సీఎం చెయ్యలేదు
కర్ణాటక ఏకీకరణ (సమైక్య కర్ణాటక) అయిన తరువాత కర్ణాటకను విభజించాలని ఏ ముఖ్యమంత్రి ప్రయత్నాలు చెయ్యలేదని యడ్యూరప్ప గుర్తు చేశారు. అయితే స్వార్థం కోసం ముఖ్యమంత్రి కుమారస్వామి ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి జేడీఎస్ పార్టీకి లబ్ధిచేకూర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని యడ్యూరప్ప ఆరోపించారు.

అన్నం, ఉద్యోగాలు
కర్ణాటక మొత్తానికి అన్న పెడుతున్నది ఉత్తర కర్ణాటక అన్నదాతలు అని, ఆ ప్రాంతానికి బడ్జెట్ లో ఒక్క పైసా ఇవ్వలేదని యడ్యూరప్ప అన్నారు. హైదరాబాద్ కర్ణాటకలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తి చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చెయ్యలేదని యడ్యూరప్ప ఆరోపించారు.

నీచంగా మాట్లాడిన సీఎం
బెంగళూరు నుంచి వస్తున్న పన్నులు ఉత్తర కర్ణాటకకు ఎలా కేటాయిస్తానని సీఎం కుమారస్వామి ఆ ప్రాంత ప్రజలను అవమానించారని యడ్యూరప్ప ఆరోపించారు. నాకు మీరు ఏమైనా ఓటు వేశారా ? మీ డిమాండ్లు పరిష్కరించడానికి అంటూ సీఎం కుమారస్వామి ఉత్తర కర్ణాటక ప్రజలను అవహేళనగా మాట్లాడారని యడ్యూరప్ప ఆరోపించారు.

నేను సీఎం పని చేస్తున్నా
ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ ప్రాంతాలకు చెందిన వందల మంది స్వామీజీలు బెళగావిలో ఆందోళన చేస్తున్నారని, సీఎం కుమారస్వామి అక్కడికి వెళ్లి వారికి నచ్చచెప్పకుండా బెంగళూరులో కుర్చున్నారని, స్వామీజీలకు నచ్చచెప్పడానికి తాను వెలుతున్నానని, సమైక్య కర్ణాటక కోసం సీఎం చేసే పని తాను చేస్తున్నానని యడ్యూరప్ప అన్నారు. తండ్రీ కోడుకులు కేవలం వారి పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి రాష్ట్రాన్ని ముక్కలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, తనతో పాటు ప్రజలు కూడా అందుకు అంగీకరించరని యడ్యూరప్ప అన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications