రైలులో నుంచి యువకుడ్ని తోసేసిన టీసీలు
మథుర: కదులుతున్న రైలులో నుంచి ఓ యువకుడ్ని తోసేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని కోసికలాన్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బాధితుడు సంజయ్ రాథోడ్ తన కాలును కోల్పోయాడు.
ఆయన ఝాన్సీ నుంచి ఆగ్రా వెళ్లేందుకు యూపీ జన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని జనరల్ బోగీలో ఎక్కిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తన టిక్కెట్టును తనిఖీ అధికారులు (టీసీలు) తీసుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ దుర్ఘటన జరగడానికి టీసీలే కారణమని సంజయ్ తెలిపాడు.

ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆ సమయంలో ఆ మార్గంలో విధులు నిర్వర్తించిన వారిని విచారిస్తామని ఎన్సీఆర్ ప్రాంతీయ రైల్వే మేనేజరు ప్రభాత్ కుమార్ వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఘటనపై కాంగ్రెస్ నేత ప్రదీప్ మాథూర్ మాట్లాడుతూ.. ఇది చాలా క్రూరమైన నేరమని అన్నారు. యువకుడిని రైలు నుంచి తోసేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నిందితులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని అసెంబ్లీ పేర్కొంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications