విమానంలో మహిళ పట్ల లైంగిక చర్యకు పాల్పడ్డాడు, తప్పయిందని లేఖ రాశాడు
విమానంలో ప్రయాణీస్తున్న మహిళ పట్ల అభ్యంగా ప్రవర్థించిన ఎన్ ఆర్ ఐ గణేష్ పార్కర్ క్షమాపణ కోరుతూ లేఖ రాశాడు. ఈ ఘటనపై ఆయన కోర్టు విచారణను ఎదుర్కొంటున్నాడు.
న్యూయార్క్ :అమెరికాలో నివసిస్తున్న భారతీయుడు విమానంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై ఆయన ఆ మహిళకు క్షమాపణ కోరుతూ లేఖ రాశాడు. అసభ్యంగా ప్రవర్తించిన గణేష్ పార్కర్ పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై నెవార్క్ ఫెడరల్ కోర్టు విచారణ చేస్తోంది.
అమెరికాలో నివసిస్తున్న గణేష్ పార్కర్ అనే భారతీయుడు విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ సీటు అయినప్పటికీ పార్కర్ ఎకానమీ క్లాస్ లో మహిళ పక్కనే ఖాళీగా ఉన్న సీటులో కూర్చొని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
విమానంలో మహిళ పక్కనే కూర్చొన్న గణేష్ పార్కర్ ఆమె నిద్రపోవడం చూసి ఆమె చొక్కాలో చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె లేచి చూసేసరికి ఆమె కప్పుకొన్న బ్లాంకెట్ తొలగించి కన్పించింది. పొరపాటున బ్లాంకెట్ జరిగిందని ఆమె భావించింది. అయితే మరోసారి ఆమె నిద్రలోకి వెళ్ళింది. అప్పుడు కూడ గణేష్ పార్కర్ మహిళ ప్రైవేట్ పార్ట్స్ తాకి అసభ్యంగా ప్రవర్తించడంతో మెలకువ వచ్చి ఆమె అరిచింది.
ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పార్కర్ తనకు కేటాయించిన సీటు వద్దకు విమాన సిబ్బంది పంపించారు. ఈ ఘటనపై ఆయన కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే తాను మూర్ఖమైన ఘటనకు పాల్పడ్డానని పార్క్ అంగీకరించారు. ఈ మేరకు క్షమాపణ కోరుతూ లేఖ రాశాడు. 50 వేల డాటర్ల పూచీకత్తుపై పార్కర్ జైలు నుండి విడుదలైనా కొంతకాలంపాటు ఆయన హౌజ్ అరెస్టు లో ఉండాలని కోర్టు ఆదేశించింది.