మిరాకిల్: మనిషి కన్నీళ్లు, ఉమ్మి నుంచి విద్యుత్?..
కన్నీటిలో ఉండే లైసోజైమ్ అనే మోడల్ ప్రోటీన్ మీద ఒత్తిడి కలిగించడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐర్లాండ్: ఐర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ లైమ్రిక్(యూఎల్) శాస్త్రవేత్తలు మనిషి కన్నీరు, ఉమ్మి, పాల నుంచి విద్యుత్ పుట్టించే ప్రయోగాలను వేగవంతం చేశారు. కన్నీటిలో ఉండే లైసోజైమ్ అనే మోడల్ ప్రోటీన్ మీద ఒత్తిడి కలిగించడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రక్రియను డైరెక్ట్ పీజోఎలక్ట్రిసిటీగా పేర్కొంటారని చెప్పారు. గుడ్డలో ఉండే తెలసొన ద్వారా కూడా ఇదే ప్రక్రియలో విద్యుత్ పుట్టించవచ్చునని వెల్లడించారు. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చగల క్వార్ట్జ్ వంటి పదార్థాలకు ఈ లక్షణం ఉంటుందన్నారు.
కాగా, రెజెనేటర్లలో, సెల్ఫోన్లలో వైబ్రేషన్ కలిగించడం కోసం, అల్ట్రా సౌండ్ ఇమేజింగ్ పరికరాల్లో పీజోఎలక్ట్రిసిటీని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఒక ప్రోటీన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం పీజోఎలక్ట్రిసిటీ ప్రక్రియను ఇంతవరకు ఉపయోగించలేదని శాస్త్రవేత్త అమీ సేపుల్టన్ తెలిపారు.