మలాలాకు 'లిబర్టీ' పతకం, చదువు కోసం విరాళం
న్యూఢిల్లీ: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మాలలా యూసఫ్ జాయ్కి మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. నేషనల్ కాన్ట్సిట్యూషన్ సెంటర్ 'అమెరికా లిబర్టీ మెడల్' అవార్డుతో ఆమెను సత్కరించింది.
అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో ఈ లిబర్టీ పతకాన్ని మాలలా యూసఫ్ జాయ్ అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల స్వాతంత్య హక్కుల పోరాటం చేసే వారికి ఏటా ఈ పతకాన్ని గౌరవ సూచకంగా అందిస్తారు.
అవార్డుతో పాటు రూ. 61 లక్షలు ఆమెకు దక్కాయి. అయితే, ఈ మొత్తాన్ని పాకిస్థాన్లో చదువు కోసం మలాలా విరాళమిచ్చింది. గతంలో ఈ పతకాన్ని అందుకున్న ప్రముఖుల్లో జార్జి బుష్, బిల్ క్లింటన్, నెల్సన్ మండేలా, కోఫి అన్నన్ ఉన్నారు.

17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి మాలాలా యూసఫ్ జాయ్ పొంది రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. లక్షల మందికి చదువు ఎంత కష్టపడితేకానీ సమకూరదో తెలియచేయాలన్న లక్ష్యంతో తాను ఎదుర్కొన్న సాహసోపేత అనుభవాన్ని ప్రపంచంలోని నిరక్షరాస్యులైన బాలలందరికీ తెలియచేయాలని తన జీవిత చరిత్రను పుస్తక రూపంలో విడుదల చేసింది.
తన జీవిత చరిత్రను విడుదల చేసిన ఆమె, తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం బర్మింగ్ హామ్లో ఉంటూ బాలికల విద్య కోసం పోరాడుతోంది. ఆమె నిరుడు ఈయూ ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ‘సఖోరోవ్ హుమన్ రైట్స్' అందుకున్నారు.
-
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
పెట్రోల్ పై రూ. 80 తగ్గింపు: బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications