పాకిస్తాన్: హైవే మీద అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నేరస్థులకు ఉరి శిక్ష
అత్యాచారానికి పాల్పడి ప్రజాగ్రహానికి కారకులైన ఇద్దరు వ్యక్తులకు పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా అనే ఇద్దరు వ్యక్తులు హైవేలో రోడ్డు మీద ఆగిపోయిన కారులో ఒక 'పాకిస్తాన్-ఫ్రెంచ్' మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు చిక్కుకుపోయి ఉండడం గమనించారు. పెట్రోల్ అయిపోవడంతో కారు లాహోర్ సమీపంలో నిలిచిపోయింది.
అది గమనించిన వీరిద్దరూ కారులోకి చొరబడి వారిని దోచుకోవడమే కాక పిల్లల ముందే ఆ మహిళపై అత్యాచారం జరిపారు.
ఈ ఘటనపై ఒక పోలీసు అధికారి, ఆమె అంత పొద్దుపోయాక బయటకు వెళ్లాల్సిన అవసరమేంటని వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసింది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
వారిద్దరూ సామూహిక అత్యాచారం, కిడ్నాప్, దోపిడీ, ఉగ్రవాద నేరాలకు పాల్పడినట్లు లాహోర్లోని ప్రత్యేక కోర్టు శనివారం నిర్థరించింది.
ఈ తీర్పుపై వాళ్లిద్దరూ పైకోర్టులో అప్పీల్ చేసుకుంటారని అబిద్ మల్హి, షఫ్కత్ అలీ బగ్గా తరపు న్యాయవాది ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు.
- అత్యాచారం: నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటే సరిపోతుందా.. సుప్రీంకోర్టు సూచనను ఎలా అర్థం చేసుకోవాలి
- 'అత్యాచారానికి గురయ్యాక నిద్రపోయాననటం.. భారత మహిళ తీరులా లేదు’: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు.. నిరసనలు వెల్లువతో ఉపసంహరణ
దాడి ఎప్పుడు, ఎలా జరిగింది...
2020 సెప్టెంబర్ 9న ఆ మహిళ తన పిల్లలు ఇద్దరితో కలిసి లాహోర్ వైపు కారులో ప్రయణిస్తుండగా, మధ్యలో పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోయింది.
ఆమె వెంటనే తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. హైవే అత్యవసర నంబర్కు కాల్ చెయ్యమని సలహా ఇచ్చి, వాళ్లు కూడా ఆమె ఉన్నచోటుకు బయలుదేరారు.
ఆ మహిళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 30 ఏళ్లు పైబడిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టి లోపలికి చొరబడి డబ్బు, నగలు దోచుకున్నారు. ఆమెను పక్కనే ఉన్న మైదానంలోకి లాక్కెళ్ళి పిల్లల ముందే రేప్ చేసి పారిపోయారు.
దాడి చేసిన వారి గుర్తులు చూచాయిగా చెప్పగలిగినప్పటికీ ఆమె మానసికంగా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఆ మర్నాడు, లాహోర్కు చెందిన ఒక అత్యున్నత పోలీసు అధికారి ఉమర్ షేక్ మీడియా ముందుకు వచ్చి ఇందులో ఆమె తప్పు కూడా ఉందన్నట్లుగా మాట్లాడారు.
పిల్లలతో కలిసి ఒంటరిగా వెళ్తున్నప్పుడు రద్దీగా ఉండే మార్గంలో ఎందుకు వెళ్లలేదు, పెట్రోలు ఉందో లేదో ఎందుకు చూసుకోలేదని ఆ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
పలు టీవీ చానళ్లలో ఆయన ఇదే అంశాన్ని మళ్లీ మళ్లీ చెబుతూ కనిపించారు.
అంతేకాకుండా, ఆ ఫ్రెంచి మహిళ పాకిస్తాన్ కూడా ఫ్రాన్స్ అంత సురక్షితమనే అభిప్రాయంతో ఉన్నారేమోనని కూడా అన్నారు. దాంతో, సోషల్ మీడియాలో ఆగ్రహం పెల్లుబికింది. బాధితులనే దోషులుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆ పోలీసు అధికారిపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఆమెకు న్యాయం జరగాలని, పాకిస్తాన్లో మహిళలకు మెరుగైన రక్షణ కల్పించాంటూ వేలాదిమంది నిరసనలు చేపట్టారు.
డిసెంబర్లో పాకిస్తాన్లో అత్యాచారానికి సంబంధించిన కొత్త చట్టాలను అమలులోకి తీసుకు వచ్చారు. వేగవంతమైన విచారణ, కఠినమైన శిక్షలను ఈ చట్టాల్లో చేర్చారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్కు ఒకసారి ఒప్పుకుంటే... ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
- లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)