అనూహ్యం: 'ప్లాస్టిక్'ని తినే ఎంజైమ్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
లండన్: ప్రపంచ దేశాలన్నింటికీ 'కాలుష్యం' ఇప్పుడో పెనుముప్పు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. భూమిలో కరగని ఈ ప్లాస్టిక్ వల్ల జీవ విధ్వంసం జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు దీనికో పరిష్కారం కనుగొనడంలో శాస్త్రవేత్తలు విఫలమయ్యారు.
రీసైక్లింగ్ తప్పించి ప్లాస్టిక్ ను నియంత్రించే ప్రత్నామ్నాయం ఏది ఇంతవరకు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్ మౌత్ శాస్త్రవేత్తలు అనూహ్యంగా ప్లాస్టిక్ ని తినే 'ఎంజైమ్' ఒకదాన్ని కనుగొన్నారు. ప్రపంచ కాలుష్య సమస్యకు ఇదో పరిష్కార మార్గమవుతుందని వారు భావిస్తున్నారు.

జీవ ఉత్ప్రేరకమైన ఈ ఎంజైమ్ జపాన్ బాక్టీరియా నుంచి ఉత్పత్తి అయినట్టుగా చెబుతున్నారు. జపాన్ రీసైక్లింగ్ సెంటర్ లో ప్రయోగాల ఫలితంగా.. క్రమంగా దీన్నిప్లాస్టిక్ ని తినే ఎంజైమ్ గా తయారుచేశారు. ప్రయోగాత్మకంగా పరిశోధకులు ఈ ఎంజైమ్ ని పరిశీలించి.. దీనికి ప్లాస్టిక్ ని తినే సామర్థ్యం ఉందని నిర్దారించారు.
'శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఊహించని పరిణామాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దానికి మా పరిశోధన కూడా మినహాయింపేమి కాదు' అని ప్రొఫెసర్ మెక్ గీహన్ తెలిపారు. నేషనల్ అకాడమీ సైన్సెస్ జర్నల్ దీన్ని ప్రచురించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications