కారులో కోటి నగదు తరలింపు, పట్టుకున్న పోలీసులు, మునుగోడు బై పోల్..
మునుగోడు బై పోల్లో ధనం ప్రవాహంలా మారుతోంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. అప్పటికీ పోలీసులు కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. చల్మడ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు.
కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. కారులో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ తో పాటు కారును కూడా సీజ్ చేశారు. డబ్బు తరలిస్తున్న వాహనం కరీంనగర్ కు చెందిన బీజేపీ నేత సొప్పరి వేణుకి చెందినదిగా గుర్తించారు. ఆయన భార్య కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్.

మునుగోడుకే కోటి రూపాయల నగదు తరలిస్తున్నట్లు విచారణలో వేణు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో విజయవాడకు చెందిన రాము దగ్గరి నుంచి కోటి రూపాయలు తీసుకుని మునుగోడు వెళ్తున్నానని వేణు చెప్పాడని పోలీసులు వివరించారు. సీజ్ చేసిన డబ్బుని ఐటీ అధికారులకు అప్పగించారు.
ఇటు ఇంటెలిజెన్స్ అధికారుల టోల్ఫ్రీ నంబరు 15400కి వచ్చిన సమాచారంతో మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం టోల్ప్లాజా వద్ద ఇంటెలిజెన్స్ టీమ్, సెబ్ అధికారులు తనిఖీలు చేశారు. బెంగళూరు నుంచి కందుకూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 14.5లక్షల నగదు, బెంగళూరు నుంచి పామూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 14 కర్ణాటక మద్యం సీసాలను పట్టుకున్నారు. నగదును మాత్రం మర్రిపాడు పోలీస్స్టేషన్లో అప్పగించారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications