రేవంత్ వ్యాఖ్యలు, బీజేపీకి కూడా కాలింది: ఇప్పటి దాకా సమాధానం లేదు, టిడిపి హెచ్చరిక
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ బిజెపి అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మండిపడ్డారు. ఆయన రేవంత్ పైన పరోక్ష విమర్శలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ బిజెపి అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మండిపడ్డారు. ఆయన రేవంత్ పైన పరోక్ష విమర్శలు చేశారు.
చదవండి: ఇమేజ్ డ్యామేజ్, ఎదురుగాలి: రేవంత్కు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్, రాంగ్స్టెప్?

రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు
మంగళవారం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో రెండే వర్గాలు ఉన్నాయని చెప్పడాన్న ఆయన ఖండించారు.

అలా చెప్పి మభ్యపెడుతున్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు అంటూ వ్యక్తిగత లబ్ధి కోసం ప్రజలను మభ్యపెడుతున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇలాంటి వాటిని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. అనుకూల, వ్యతిరేక వర్గాలు అని చెప్పుకుంటున్న రెండూ రెండే అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారు.

బీజేపీకి అక్కడే కాలింది
తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ అనుకూల, కేసీఆర్ వ్యతిరేక వర్గాలు రెండే ఉన్నాయని రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తెలంగాణలో బిజెపి లేనే లేదన్నారు. కేసీఆర్ వ్యతిరేక వర్గంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారు. తెలంగాణలో బిజెపి ప్రభావం లేదని ఆయన అభిప్రాయం. ఆ పార్టీని లెక్కలోకి కూడా తీసుకోలేదు. దీంతో ఆ పార్టీకి అక్కడే కాలిందని అంటున్నారు.

ఇప్పటిదాకా టి-టిడిపికి వివరణ ఇవ్వని రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసినట్లు మీడియాలో వార్తలు రావడం, ఆ పార్టీలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం సాగడంపై టిడిపి అధిష్టానం ఆయన నుంచి వివరణ కోరింది. చంద్రబాబు ఆదేశాల మేరకు టి-టిడిపి అధ్యక్షులు రమణ వివరణ కోరారు. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నుంచి సమాధానం రాలేదు.

ఎప్పడికప్పుడు చంద్రబాబు దృష్టికి
పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలంగాణ టిడిపి నేతలు.. చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై రమణ కూడా మంగళవారం మాట్లాడిన విషయం తెలిసిందే. రేవంత్ ఎదగడానికి తాను ఎంతో కృషి చేసినట్లు రమణ తెలిపారు. కానీ పార్టీని దాటి వ్యక్తిగతంగా బలోపేతం కావాలని ఆయన భావించినట్లు ఇప్పుడు తెలుస్తోందన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల అంశాన్ని చంద్రబాబు చూసుకుంటారని, ఎవరు దేనిపై మాట్లాడాలో అధిష్ఠానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి సహా ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు ఉంటాయని రమణ హెచ్చరించారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications