చీఫ్ జస్టిస్ కంటతడి కలచివేసింది: ఇంద్రకరణ్, వినూత్నంగా కొత్త హైకోర్టు: బాబు
న్యూఢిల్లీ: పెండింగ్ కేసుల పట్ల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ కంటతడి పెట్టించడం తమ మనసు కలచివేసిందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం అన్నారు. చాలా కేసుల్లో దాదాపు నిందితులు పదిహేనేళ్లుగా జైల్లో ఉంటున్నారని చెప్పారు.
అయినప్పటికీ వారి పైన ట్రయల్స్ జరుగుతున్నాయని సీజే చెప్పారన్నారు. కేసుల పరిష్కారం కన్నా ఏటా కేసులు 50 శాతం పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కోర్టులు, జడ్జిల సంఖ్య పెంచడం అవసరమని చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
న్యాయవ్యవస్థ సంస్కరణల పైన ఢిల్లీలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు చీఫ్ జస్టిస్ ఠాకూర్, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

వినూత్నంగా కొత్త హైకోర్టు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త హైకోర్టు రాబోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కొత్త హైకోర్టును విభిన్నంగా నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సమస్యల పైన చీఫ్ జస్టిస్ యాక్షన్ ప్రోగ్రాం రూపొందించారని చెప్పారు.
హైకోర్టులు, ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం పైన చర్చ జరిగిందని చెప్పారు. న్యాయశాఖలో సమస్యల పరిష్కారంపై సమావేశంలో చర్చించామని చెప్పారు. ఒక్కో సమస్య పైన చీఫ్ జస్టిస్ యాక్షన్ ప్రోగ్రాం రూపొందించారని చెప్పారు.
ఏడు, ఎనిమిది అంశాల ఆధారంగా యాక్షన్ ప్లాన్ రూపొందించారని చెప్పారు. జ్యూడిషియల్ సిస్టమ్ మొత్తం కంప్యూటరైజేషన్ పైన చీఫ్ జస్టిస్ మాట్లాడారని చెప్పారు. కమర్షియల్ కోర్టుల అంశం పైన కూడా చర్చించినట్లు చంద్రబాబు చెప్పారు. కోర్టుల్లో ఖాళీలపై ప్రతి ఏటా పది శాతం ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారన్నారు.
-
అన్నదాతకు భరోసా: రైతుల ఖాతాల్లోకి రూ. 2,670 కోట్లు! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications