priyank reddy murder: హోంమంత్రి వ్యాఖ్యలపై గీతారెడ్డి ఫైర్
హైదరాబాద్: నగరంలోని శంషాబాద్లో సామూహిక అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గీతా రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
ప్రియాంక హత్య ఘటన అందరినీ కలిచివేసిందని గీతారెడ్డి అన్నారు. ప్రియాంక ఘటన మరువక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమని తెలిపారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని అన్నారు.

ప్రమాద సమయంలో ప్రియాంక తన చెల్లెలికి కాకుండా పోలీసులకు కాల్ చేసివుండాల్సిందంటూ హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై గీతారెడ్డి మండిపడ్డారు. ఆ సమయంలో ఏ అమ్మాయి అయినా కుటుంబసభ్యులకే ఫోన్ చేస్తుందని.. అలా జరుగుతుందని ఆమె అనుకుంటుందా? అని ప్రశ్నించారు.
2017లో మహిళల హత్యలు 14శాతం పెరిగాయని ఆమె తెలిపారు. అంతేగాక, మహిళల అక్రమ రవాణా కూడా ఎక్కువగా జరుగుతోందని అన్నారు. తమ కూతురు కనిపించడం లేదంటూ ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు పట్టించుకోలేదని, అంతేగాక, వారితో అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
బుధవారం రాత్రి నలుగురు వ్యక్తులు ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. శుక్రవారం రాత్రి వారిని మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ కేసులో ఏ1గా మహ్మద్ ఆరీఫ్(26, ఏ2 జొల్లు శివ(20), ఏ3 జొల్లు నవీన్(20), ఏ4 చింతకుంట చెన్నకేశవులు(20)గా ఉన్నారు.
కాగా, ప్రియాంక రెడ్డి ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు.. నిరసన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియాంక నివాసం వద్ద కూడా నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. నిందితులను కూడా కాల్చివేయాలని డిమాండ్ చేశారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications