ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ (ఫోటోలు)
హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు గాను దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచిత మంత్రాన్ని పఠిస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట కోసం ప్రజల కోసం ఆయా పార్టీలు ఉచితంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టడం మనం చూశాం.
అయితే ఈ 'ఉచితం'పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉచితానికి మంగళం పాడి, ప్రజలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా పారిశ్రామికవేత్తలు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు.
వివరాల్లోకి వెళితే... సోమవారం హైదరాబాదులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టాప్సీ) శతాబ్ది ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎఫ్టాప్సీ వంద సంవత్సరాల లోగో, మార్పులు చేసిన వెబ్సైటును, ప్రచార కార్యక్రమానికి సంబంధించిన లఘు చిత్రాన్ని ఆయన విడుదల చేశారు.

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్టాప్సీ శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించడం తనకెంతో గర్వకారణంగా ఉందని, ఎఫ్టాప్సీ ప్రయాణంలో పాలుపంచుకున్న వారందరికీ ఇది మరిచిపోలేని రోజని గవర్నర్ పేర్కొన్నారు. పరిశ్రమలు తప్పనిసరిగా పాటించాల్సిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ను ప్రధానంగా ప్రస్తావించారు.

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
పారిశ్రామికవేత్తలు పల్లె సీమలను పట్టణాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు పాటు పడాలని ఆయన సూచించారు. తమ సీఎస్ఆర్ నిధులను పట్టణాలకు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. వీటిలో సామర్థ్యాలు, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని గవర్నర్ కోరారు.

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
‘‘సామాజికంగా వివిధ వర్గాలను ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తేనే మంచి ఫలితాలుంటాయి. వారికి ఆర్థికంగా చేయూత ఇవ్వాలి. సంపాదించే శక్తినీ ఇవ్వాలి. దాంతో వారు ఆత్మ గౌరవంతో జీవనం కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఉచిత పథకాలను తప్పనిసరిగా రద్దు చేయాలి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఉచితం వద్దు: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్
ఈ కార్యక్రమంలో ఎఫ్టాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోదీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, శతాబ్ధి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ అనిల్ రెడ్డి వెన్నం తదితరులు మాట్లాడారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications